క్రీజ్లో దిగి... బ్యాటింగ్ చేసేందుకు... Tapsee రెడీ!
ABN , First Publish Date - 2021-12-04T17:01:30+05:30 IST
బాలీవుడ్ తెరపై ఇండియన్ క్రికెటర్స్ బయోపిక్స్ కొత్తేం కాదు. గతంలో ధోనీ, అజారుద్దీన్ జీవిత చరిత్రలు ప్రేక్షకుల్ని అలరించాయి. ఇప్పుడు మరో క్రికెట్ బయోపిక్ బాక్సాఫీస్ వద్దకొచ్చేస్తోంది. పైగా ఈసారి ఇండియన్ ఉమెన్ క్రికెట్కు చెందిన లివింగ్ లెజెండ్ సక్సెస్ స్టోరీ జనం చూడబోతున్నారు...
బాలీవుడ్ తెరపై ఇండియన్ క్రికెటర్స్ బయోపిక్స్ కొత్తేం కాదు. గతంలో ధోనీ, అజారుద్దీన్ జీవిత చరిత్రలు ప్రేక్షకుల్ని అలరించాయి. ఇప్పుడు మరో క్రికెట్ బయోపిక్ బాక్సాఫీస్ వద్దకొచ్చేస్తోంది. పైగా ఈసారి ఇండియన్ ఉమెన్ క్రికెట్కు చెందిన లివింగ్ లెజెండ్ సక్సెస్ స్టోరీ జనం చూడబోతున్నారు. ఒక విధంగా బాలీవుడ్ స్క్రీన్ మీద తాప్సీ పన్ను ఫస్ట్ ఉమెన్ క్రికెటర్గా రికార్డ్ సృష్టించబోతోంది...
బీ-టౌన్లో విభిన్న కథాంశాలతో సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటోంది తాప్సీ. తాజాగా ఆమె ‘శభాష్ మిథూ’ సినిమాతో తన ఫిల్మోగ్రఫి మరింత ప్రత్యేకం చేసుకుంది. ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ కెప్టెన్గా దేశానికి అనేక విజయాలు అందించిన మిథాలీ రాజ్ బయోపిక్లో తాప్సీ నటించింది. తమ స్పోర్ట్స్ డ్రామా మూవీని 2022 ఫిబ్రవరీ 4న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.
చాలా సంవత్సరాల పాటూ భారతీయ మహిళల క్రికెట్కి సారథ్యం వహించిన మిథాలీ జీవితంలో అనేక అద్భుత ఘట్టాలున్నాయి. ఆమె ఎదుగుదలతోనే ఇండియన్ ఉమెన్ క్రికెట్ ఎదుగుదల కూడా ముడిపడి ఉంది. అందుకే, ‘శభాష్ మిథూ’ సినిమాపై అందరి దృష్టి ప్రస్తుతం కేంద్రీకృతమైంది. తాప్సీ తెర మీద ప్రొఫెషనల్ క్రికెటర్గా ఎలా ఇన్నింగ్స్ కొనసాగించి ఉంటుందని కూడా ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు...