యథార్థ సంఘటనల ప్రేమకథ
ABN , First Publish Date - 2021-09-28T05:09:40+05:30 IST
తని్ష్కరెడ్డి, అంకిత సాహు జంటగా ఏవీ క్రియేటివ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించే తొలి చిత్రం షూటింగ్ సోమవారం ఉదయం రామానాయుడు స్టూడియోలో మొదలైంది. మాధవ్ మూర్తి దర్శకత్వంలో రిచా భట్నాగర్,...
తని్ష్కరెడ్డి, అంకిత సాహు జంటగా ఏవీ క్రియేటివ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించే తొలి చిత్రం షూటింగ్ సోమవారం ఉదయం రామానాయుడు స్టూడియోలో మొదలైంది. మాధవ్ మూర్తి దర్శకత్వంలో రిచా భట్నాగర్, విజయలక్ష్మి నిర్మిస్తున్నారు. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన తొలి షాట్కు జ్యోత్స్న క్లాప్ ఇవ్వగా, వెంకట్ (ప్రవీణ్) యాదవ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మంచి కంటెంట్తో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర హీరో, సమర్పకుడు తని్ష్కరెడ్డి చెప్పారు.
యథార్థ సంఘటనల ఆధారంగా గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకొంటున్న ప్రేమకథా చిత్రమిదని దర్శకుడు చెప్పారు. ‘అక్టోబర్ చివరి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేస్తాం’ అని ఆయన తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఆర్.ఆర్.ధ్రువన్, ఫొటోగ్రఫీ: సతీశ్ ముత్యాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేశ్ ముమ్మలనేని.