మరోసారి మెగాస్టార్‌తో తమన్నా..?

ABN , First Publish Date - 2021-09-24T13:41:47+05:30 IST

మరోసారి మెగాస్టార్‌తో మిల్కీ బ్యూటీ తమన్నా జతకట్టబోతోందా..అవుననే టాక్ ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. కొరటాల శివతో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.

మరోసారి మెగాస్టార్‌తో తమన్నా..?

మరోసారి మెగాస్టార్‌తో మిల్కీ బ్యూటీ తమన్నా జతకట్టబోతోందా..అవుననే టాక్ ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. కొరటాల శివతో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే మెగాస్టార్ తన పార్ట్ కంప్లీట్ కూడా చేశారు. దీని తర్వాత రెండు రీమేక్ సినిమాలను చిరు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి మోహన్ రాజా తెరకెక్కిస్తున్న 'గాడ్ ఫాథర్'. ఇటీవలే దీని చిత్రీకరణ ఊటీలో ప్రారంభం అయింది. మెగాస్టార్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. 



దీనితో పాటుగా మరో రీమేక్ మూవీ 'భోళా శంకర్' సినిమాని కూడా ఈ ఏడాదే సెట్స్ మీదకి తీసుకురానుండగా, ఇందులో కీర్తి సురేశ్ చిరుకి చెల్లిగా నటిస్తోంది. అయితే ఇందులో ఆయన సరసన తమన్నాని తీసుకోవాలని దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దీనిపై త్వరలో ఓ స్పష్ఠత రానుందట. ఇంతకముందు 'సైరా'లో చిరుతో కలిసి తమన్నా స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. 


Updated Date - 2021-09-24T13:41:47+05:30 IST