‘భోళాశంకర్’ విషయంలో తమన్నా టెన్షన్?

ABN , First Publish Date - 2021-10-25T14:02:22+05:30 IST

టాలీవుడ్ లో తమన్నా హవా ఇంకా కొనసాగుతునే ఉంది. ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ ను అందుకోవడంలో అమ్మడు అందెవేసిన చేయి. రీసెంట్ గా ఓటీటీలో నితిన్ ‘మాస్ట్రో’ తో మెప్పించిన ఆమె.. థియేటర్స్ లో గోపీచంద్ ‘సీటీమార్’ మూవీతోనూ ప్రేక్షకుల్ని అలరించింది. ఇక మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేశ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘భోళాశంకర్’ లో కథానాయికగా ఎంపికైందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో తమన్నా టెన్షన్ పడుతోందని తెలుస్తోంది.

‘భోళాశంకర్’ విషయంలో తమన్నా టెన్షన్?

టాలీవుడ్ లో తమన్నా హవా ఇంకా కొనసాగుతునే ఉంది. ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ ను అందుకోవడంలో అమ్మడు అందెవేసిన చేయి. రీసెంట్ గా ఓటీటీలో నితిన్ ‘మాస్ట్రో’ తో మెప్పించిన ఆమె.. థియేటర్స్ లో గోపీచంద్ ‘సీటీమార్’ మూవీతోనూ ప్రేక్షకుల్ని అలరించింది. ఇక  మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేశ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘భోళాశంకర్’ లో కథానాయికగా ఎంపికైందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో తమన్నా టెన్షన్ పడుతోందని తెలుస్తోంది. దానికి కారణం.. నిర్మాతలు ఆ విషయమై ఇంకా ఆమెను సంప్రదించలేదట. అంతేకాదు.. దానికి సంబంధించిన అడ్వాన్స్ కూడా ఆమె ఇంకా అందుకోలేదట, అఫీషియల్ గా ఆమె నటిస్తున్నట్టు అనౌన్స్‌మెంట్ కూడా ఇవ్వలేదు.


  

తాజా సమాచారం ప్రకారం వేరే కథానాయికను చిరు సరసన సెట్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. అందుకే చిరు సరసన రొమాన్స్ చేసే అరుదైన ఛాన్స్ ఎక్కడ మిస్ అవుతుందోనని ఆమెకి ఒకటే టెన్షన్ గా ఉందట. ఇంతకు ముందు చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ మూవీలో తమన్నా ఓ ప్రత్యేక పాత్ర ధరించిన సంగతి తెలిసిందే. అయితే అందులో ఆమె చిరుకి పెయిర్ కాదు. ఆ సినిమా చేసిన దగ్గర నుంచి చిరంజీవి సరసన కథానాయికగా నటించే ఛాన్స్ వస్తే మిస్ చేసుకోకూడదని డిసైడయిందట. అందుకే ‘భోళాశంకర్’ విషయంలో ఆమె అంత టెన్షన్ పడుతోందట. మరి నిజంగా తమన్నాని ‘భోళాశంకర్’ నుంచి తప్పిస్తారో లేక ఆమెనే ఫిక్స్ చేస్తారో చూడాలి.   

Updated Date - 2021-10-25T14:02:22+05:30 IST