సీఎం జగన్‌తో సమావేశం గురించి చిరంజీవితో మాట్లాడా: నాగార్జున

ABN , First Publish Date - 2022-01-19T15:58:40+05:30 IST

సీఎం జగన్‌తో సమావేశం గురించి చిరంజీవితో మాట్లాడానన్నారు హీరో నాగార్జున. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఏపీలో టికెట్ ధరలకు సంబంధించిన విషయంతో పాటు చిత్రపరిశ్రమకు సంబంధించిన పలు విషయాలను చర్చించేందుకు

సీఎం జగన్‌తో సమావేశం గురించి చిరంజీవితో మాట్లాడా: నాగార్జున

సీఎం జగన్‌తో సమావేశం గురించి చిరంజీవితో మాట్లాడానన్నారు హీరో నాగార్జున. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఏపీలో టికెట్ ధరలకు సంబంధించిన విషయంతో పాటు చిత్రపరిశ్రమకు సంబంధించిన పలు విషయాలను చర్చించేందుకు ఏపీ సీఎం జగన్‌తో సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం తర్వాత చిరంజీవితో మాట్లాడానని  రాజమండ్రిలో జరిగిన 'బంగార్రాజు' చిత్ర విజయోత్సవ కార్యక్రమంలో నాగ్ తెలిపారు. సినీ పరిశ్రమపై సానుకూలంగా స్పందించిన జగన్‌కు కృతజ్ఞతలు అన్నారు. ఇదే సందర్భంగా మాట్లాడుతూ.. "ఇకనుంచి సినీ పరిశ్రమకు అన్నీ మంచిరోజులే. ఎన్టీఆర్, ఏఎన్నార్ సినీ పరిశ్రమకు రెండు కళ్లు. చిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం వాళ్లిద్దరు జీవించే ఉంటారు. ప్రపంచమంతా సినిమాలకు దూరంగా ఉన్నప్పుడు తెలుగువాళ్లు సినిమా చూస్తామనే నమ్మకాన్ని కలిగించారు. 'బంగార్రాజు' విజయం నా నమ్మకం కాదు, తెలుగు ప్రేక్షకులపై ఉన్న నమ్మకం" అని నాగార్జున అన్నారు. ఇక ఈ కార్యక్రమానికి మంత్రి కన్నబాబు, ఎంపీ భరత్, నటుడు - దర్శక, నిర్మాత నారాయణమూర్తి హాజరయ్యారు.  

Updated Date - 2022-01-19T15:58:40+05:30 IST