'తలైవి' సీక్వెల్..?

ABN , First Publish Date - 2021-09-24T17:28:15+05:30 IST

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'తలైవి' చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా సీక్వెల్ రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయట.

'తలైవి' సీక్వెల్..?

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'తలైవి' చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా సీక్వెల్ రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ టైటిల్ పాత్రలో నటించగా, ఏ.ఎల్.విజయ్ దర్శకత్వం వహించాడు. బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ దీనికి కథ అందించారు. ఇటీవలే వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ సినిమాను తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేశారు. అయితే బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం ఆశించినంతగా మెప్పించలేకపోయింది. తమిళంలో ఓ మోస్తరుగా ఆడిన 'తలైవి'.. మిగతా భాషల్లో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది.


అయినా 'తలైవి' సీక్వెల్ నిర్మించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. విజయేంద్ర ప్రసాద్‌తో సీక్వెల్ కోసం స్క్రిప్టు రెడీ చేయిస్తున్నారని సమాచారం. 'తలైవి' కథ ముగిసిన దగ్గర్నుంచి జయలలిత జీవిత చరమాంకం వరకు సీక్వెల్‌లో చూపించబోతున్నారని తెలుస్తోంది. త్వరలో దీనిపై ఓ క్లారిటీ రానుందని అంటున్నారు.

Updated Date - 2021-09-24T17:28:15+05:30 IST