22 యేళ్ళ తర్వాత... అజిత్ చిత్రంలో టబు?
ABN , First Publish Date - 2022-01-28T02:40:52+05:30 IST
అగ్రహీరో అజిత్ కుమార్ తన తదుపరి చిత్రంపై దృష్టి సారించారు. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మించే ఈ చిత్రానికి హెచ్.వినోద్ దర్శకత్వం వహించనున్నారు. వాస్తవానికి అజిత్, హెచ్.వినోద్, బోనీ కపూర్ కాంబినేషన్లో తెరకెక్కిన
అగ్రహీరో అజిత్ కుమార్ తన తదుపరి చిత్రంపై దృష్టి సారించారు. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మించే ఈ చిత్రానికి హెచ్.వినోద్ దర్శకత్వం వహించనున్నారు. వాస్తవానికి అజిత్, హెచ్.వినోద్, బోనీ కపూర్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘వలిమై’ చిత్రం సంక్రాంతికి విడుదలకావాల్సి ఉంది. కానీ, కరోనా కారణంగా వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు కాంబినేషన్లోనే మరో చిత్రం తెరకెక్కనుంది. ఇందుకోసం నటీనటుల ఎంపిక జరుగుతున్నట్టు సమాచారం.
ఇందులో భాగంగా, బాలీవుడ్ నటి టబును ఓ ముఖ్య పాత్ర కోసం ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అజిత్ - టబు కలిసి 2000లో రాజీమ్ మేనన్ దర్శకత్వంలో వచ్చిన ‘కండుకొండేన్ కండుకొండేన్’ అనే చిత్రంలో నటించారు. 22 యేళ్ళ తర్వాత మరోమారు కలిసి నటించనున్నారు. ఇదిలా ఉండగా బోనీ కపూర్ నిర్మిస్తున్న తమిళ చిత్రాల్లో బాలీవుడ్ హీరోయిన్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే ‘వలిమై’ చిత్రంలో హీరోయిన్గా హ్యూమా ఖురేషీకి అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఇపుడు టబుకు ఆ అవకాశం దక్కినట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం.