ఆసక్తికరంగా సుశాంత్-ప్రియా ఆనంద్ల ‘మా నీళ్ల ట్యాంక్’ టీజర్
ABN , First Publish Date - 2022-06-28T03:26:01+05:30 IST
మా నీళ్ల ట్యాంక్’ (Maa Neella Tank) వెబ్ సిరీస్తో టాలీవుడ్ నటుడు సుశాంత్ (Sushanth) డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. లక్ష్మీ సౌజన్య (Lakshmi Sowjanya) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ వెబ్ సిరీస్లో
‘మా నీళ్ల ట్యాంక్’ (Maa Neella Tank) వెబ్ సిరీస్తో టాలీవుడ్ నటుడు సుశాంత్ (Sushanth) డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. లక్ష్మీ సౌజన్య (Lakshmi Sowjanya) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ వెబ్ సిరీస్లో దాదాపు 10 సంవత్సరాల విరామం తర్వాత ప్రియా ఆనంద్ (Priya Anand) తెలుగు తెరపై కనిపించబోతోంది. జూలై 15 నుండి Zee5 ఓటీటీలో ప్రీమియర్గా రాబోతున్న ఈ వెబ్ సిరీస్కు సంబంధించిన టీజర్ను తాజాగా విడుదల చేశారు. ఈ టీజర్ ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. వెబ్ సిరీస్ కోసం వేచి చూసేలా చేస్తోంది. విడుదలైన టీజర్కు మంచి స్పందన వస్తుండటంతో ఈ సిరీస్ బృందం సంతోషం వ్యక్తం చేస్తోంది.
‘మా నీళ్ల ట్యాంక్’ వెబ్ సిరీస్కు సంబంధించి దర్శకురాలు లక్ష్మీ సౌజన్య మాట్లాడుతూ.. ‘‘ఇది 8-ఎపిసోడ్లు కలిగిన వెబ్ సిరీస్. ఒక ఫీల్ గుడ్ పల్లెటూరి కథ. బుచ్చివోలు అనే గ్రామం నేపథ్యంలో సాగే ఈ సిరీస్ ఒక ఉత్తేజకరమైన విధంగా సాగుతుంది. ఎమ్మెల్యే కోదండం కుమారుడు గోపాల్ తను ప్రేమించిన సురేఖ తిరిగి రాకపోతే పనికిరాని వాటర్ ట్యాంక్లో దూకుతానని బెదిరిస్తాడు. అప్పుడే ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఎందుకు తన కొడుకు ఇలా చేస్తున్నాడని కోదండం కంగుతింటాడు . అతని బంధువు నరసింహం, అదే సమయంలో, అతని ప్రతిష్టను దెబ్బతీయడానికి మరియు అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. అలాగే అదే ఊరిలో గిరి అనే సబ్ఇన్స్పెక్టర్కు ఊరి నుంచి బదిలీ కావాల్సి వస్తే సురేఖను తిరిగి తీసుకొచ్చే పనిని అప్పగిస్తారు. ఇద్దరు రాజకీయ ప్రత్యర్థుల మధ్య పిల్లి మరియు ఎలుకల ఆట మాదిరి జరుగుతుంటే, మరో వైపు గురుమూర్తి వాటర్ ట్యాంక్ మరమ్మతుల నుండి డబ్బును పొందాలని కోరుకుంటాడు. పనికిరాని ట్యాంక్ మరియు అమాయక సురేఖ చిన్న లక్ష్యాలతో స్వార్థపరుల చేతుల్లో ఎలా సాధనాలుగా మారారనేది రొమాంటిక్ కామెడీతో చక్కగా తెరకెక్కించాము. నాకిలాంటి మంచి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఇచ్చిన ZEE5కు ధన్యవాదాలు’’ అని తెలిపారు.