సూర్య నిర్మించిన 'ఓ మై డాగ్' రిలీజ్ డేట్ ఫిక్స్..

ABN , First Publish Date - 2022-04-07T16:55:32+05:30 IST

తమిళ స్టార్ హీరో సూర్య ఆయన సతీమణి, హీరోయిన్ జ్యోతిక కలిసి నిర్మించిన తాజా చిత్రం 'ఓ మై డాగ్' రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

సూర్య నిర్మించిన 'ఓ మై డాగ్' రిలీజ్ డేట్ ఫిక్స్..

తమిళ స్టార్ హీరో సూర్య ఆయన సతీమణి, హీరోయిన్ జ్యోతిక కలిసి నిర్మించిన తాజా చిత్రం 'ఓ మై డాగ్' రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 21న స్ట్రీమింగ్ చేసేందుకు సిద్దం చేసినట్లుగా చిత్రబృందం వెల్లడించింది. ఇందులో అరుణ్ విజయ్ ముఖ్య పాత్రలో నటించాడు. అరుణ్ విజయ్ తండ్రి విజయ్ కుమార్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. 


ఇక సూర్య నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. కాగా, సూర్య హీరోగా ఇటీవల ఓ సినిమాను ప్రకటించారు. ఇందులో హీరోయిన్‌గా కృతిశెట్టి నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు బాలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దాదాపు 18 ఏళ్ళ తర్వాత సూర్య - బాలా కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కబోతోంది. ఇక 'ఆకాశం నీ హద్దురా', 'జై భీమ్' చిత్రాలతో భారీ హిట్స్ అందుకున్న సూర్య గత చిత్రం 'ఈటీ' మాత్రం నిరాశపరిచింది. 

Updated Date - 2022-04-07T16:55:32+05:30 IST