Suriya: సినిమా కలెక్షన్స్ నుంచి భారీగా విరాళం అందించిన సూర్య
ABN , First Publish Date - 2022-08-15T01:49:12+05:30 IST
బాక్సాఫీస్ వసూళ్లతో సంబంధం లేకుండా ప్రయోగాలు చేస్తూ సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు సూర్య (Suriya). ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ వంటి చిత్రాలతో మెప్పించాడు. ఈ మధ్యనే అతడి
బాక్సాఫీస్ వసూళ్లతో సంబంధం లేకుండా ప్రయోగాలు చేస్తూ సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు సూర్య (Suriya). ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ వంటి చిత్రాలతో మెప్పించాడు. ఈ మధ్యనే అతడి నుంచి వచ్చిన సినిమా ‘ఎవరికీ తలవంచడు(ఈటి)’. ఈ మూవీ బాక్సాఫీస్ను మెప్పించలేకపోయింది. సూర్య నిర్మాతగా వ్యవహరించిన తాజా చిత్రం ‘విరుమన్’ (Viruman). కార్తి (Karthi), అదితి శంకర్ (Aditi Shankar) హీరో, హీరోయిన్గా నటించారు. ముత్తయ్య (Muthaiya) దర్శకత్వం వహించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో సూర్య నడిగర్ సంఘం భవనానికి మూవీ కలెక్షన్స్ నుంచి భారీ విరాళం అందించాడు.
నడిగర్ సంఘం 6వ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం తాజాగా జరిగింది. ఈ మీటింగ్కు సూర్య, కార్తి హాజరయ్యారు. నడిగర్ సంఘం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఫండ్కు సినిమా కలెక్షన్స్ నుంచి రూ. 25లక్షలను సూర్య విరాళంగా అందజేశాడు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ నాజర్, వైస్ ప్రెసిడెంట్ కరుణాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే నేషనల్ అవార్డు గెలుచుకున్న సందర్భంగా మెంబర్స్ సూర్యను సత్కరిచారు. ‘విరుమన్’ ను 2-డీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సూర్య, జ్యోతిక సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదల అయ్యి భారీ విజయం సాధించింది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ‘ఖైదీ-2’ కు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ను కార్తి అభిమానులతో పంచుకున్నాడు. ‘ఖైదీ-2’ (Kaithi 2) షూటింగ్ 2023లో ప్రారంభమతుందని చెప్పాడు. లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj) విజయ్తో చేస్తున్న సినిమా పూర్తి కాగానే ‘ఖైదీ-2’ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని పేర్కొన్నాడు. ‘ఖైదీ-2’ లో రోలెక్స్ పాత్ర ఉంటుందో, లేదో తనకు తెలియదని తెలిపాడు. ప్రస్తుతానికీ ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం కష్టం అని వెల్లడించాడు.