సురేశ్ ప్రొడక్షన్స్ కొత్త చిత్రం 'దొంగలున్నారు జాగ్రత్త'

ABN , First Publish Date - 2021-07-09T18:28:33+05:30 IST

ప్రముఖ నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ 'దొంగలున్నారు జాగ్రత్త' అనే వెరైటీ టైటిల్‌తో కొత్త చిత్రం తెరకెక్కబోతోంది. ఇందులో సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి తనయుడు సింహా హీరోగా నటించనున్నాడు.

సురేశ్ ప్రొడక్షన్స్ కొత్త చిత్రం 'దొంగలున్నారు జాగ్రత్త'

ప్రముఖ నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ 'దొంగలున్నారు జాగ్రత్త' అనే వెరైటీ టైటిల్‌తో కొత్త చిత్రం తెరకెక్కబోతోంది. ఇందులో సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి తనయుడు సింహా హీరోగా నటించనున్నాడు. ఈ యంగ్ హీరో 'మత్తువదలరా' అనే సినిమా ద్వార టాలీవుడ్‌కి పరిచయమయ్యాడు. ఇటీవల 'తెల్లవారితే గురువారం' అనే సినిమాతో వచ్చి ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో మూడవ సినిమాగా 'దొంగలున్నారు జాగ్రత్త'లో నటించే అవకశం దక్కించుకున్నాడు. గురు ఫిలిమ్స్ - సురేశ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. తాజాగా రామానాయుడు స్టూడియోలో ఈ మూవీ పూజా కార్యక్రమాలను జరుపుకుంది. సతీశ్ త్రిపుర దర్శకుడిగా పరిచయమవుతుండగా, థ్రిల్లర్ నేపథ్యంలో కథ సాగుతుందట. సముద్రఖని ఇందులో ఒక కీలకమైన పాత్ర పోషించనున్నారు. కాగా త్వరలో రెగ్యులర్ షూటింగు మొదలుకాబోతోంది. 

Updated Date - 2021-07-09T18:28:33+05:30 IST