#RC15 : విలన్‌గా మలయాళ విలక్షణ నటుడు?

ABN , First Publish Date - 2021-10-26T16:08:54+05:30 IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మాణంలో ఓ క్రేజీ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల పూణే లో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. చెర్రీ, కియారా అద్వానీ పై ఓ పాట, కొన్ని కీలక సన్నివేశాలు ఈ షెడ్యూల్ లో షూట్ చేయబోతున్నారు. రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’, చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలకి సంబంధించి తన వర్క్ కంప్లీట్ చేసిన చెర్రీ.. ఇప్పుడు శంకర్ మూవీపై ఫుల్ ఫోకస్ పెట్టబోతున్నారు.

#RC15 : విలన్‌గా మలయాళ విలక్షణ నటుడు?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మాణంలో ఓ క్రేజీ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల పూణే లో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. చెర్రీ, కియారా అద్వానీ పై ఓ పాట, కొన్ని కీలక సన్నివేశాలు ఈ షెడ్యూల్ లో షూట్ చేయబోతున్నారు. రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’, చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలకి సంబంధించి తన వర్క్ కంప్లీట్ చేసిన చెర్రీ.. ఇప్పుడు శంకర్ మూవీపై ఫుల్ ఫోకస్ పెట్టబోతున్నారు. ఇందులో చరణ్ ఐఏయస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.  సమకాలీన రాజకీయాల నేపథ్యంలో, ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమా ఉండబోతోందట. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఓ లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.



తాజా సమాచారం ప్రకారం #RC15 లో విలన్ గా మలయాళ విలక్షణ నటుడు సురేశ్ గోపి నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇందులో ఆయన పొలిటీషియన్‌గా నటించబోతున్నారట. మాలీవుడ్ లో పోలీస్ చిత్రాలకు, యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ ఆయన. ఇంతకు ముందు శంకర్ చిత్రం ‘ఐ’ లో పాలిష్డ్ విలన్ గా మెప్పించిన ఆయన ఇప్పుడు మళ్ళీ శంకర్ సినిమాతోనే, అందులోనూ రామ్ చరణ్ తో మొదటి సారిగా వర్క్ చేయనుండడం ఆసక్తిరేపుతోంది. నిజానికి, కృష్ణంరాజు ‘అంతిమ తీర్పు’ సినిమాతో నటుడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు సురేశ్ గోపి. ఆ తర్వాత అజయ్ హీరోగా నటించిన ‘ఆ ఒక్కడు’ మూవీలోనూ నటించారు. 12 ఏళ్ళకు మళ్ళీ #RC15తో టాలీవుడ్ లో విలన్ గా నటిస్తుండడం విశేషంగా మారింది. అలాగే.. ఇందులో సురేశ్ గోపి భార్యగా బాలీవుడ్ నటీమణి ఇషా గుప్తా కూడా నటిస్తున్నట్టు సమాచారం. మరి సురేశ్ గోపీ ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో విలన్ గా బిజీ అవుతారేమో చూడాలి.     

Updated Date - 2021-10-26T16:08:54+05:30 IST