శ్యామ్ కె.నాయుడుకు సుప్రీం నోటీసులు

ABN , First Publish Date - 2021-03-03T21:31:32+05:30 IST

సినీ నటి శ్రీసుధనే వేధించిన కేసులో సినిమాటోగ్రఫర్‌ శ్యామ్

శ్యామ్ కె.నాయుడుకు సుప్రీం నోటీసులు

హైదరాబాద్: సినీ నటి శ్రీసుధనే వేధించిన కేసులో సినిమాటోగ్రఫర్‌ శ్యామ్ కె.నాయుడుకి సుప్రీంకోర్టు  నోటీసులు జారీ చేసింది. శ్యామ్ కె.నాయుడు బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్ట్‌లో శ్రీసుధ కేసు వేసింది. నెలరోజుల్లో నోటీసులకు సమాధానం ఇవ్వాలని శ్యామ్ కె.నాయుడుని  సుప్రీంకోర్ట్ ఆదేశించింది. పెళ్లి పేరుతో తనని మోసం చేశాడని శ్యామ్ కె నాయుడు పైగతంలో సినీనటి శ్రీసుధ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 


కాంప్రమైజ్ అయినట్లు నకిలీ డాక్యుమెంట్లు, చెక్కులు , డీడీలు రూపంలో 50 లక్షలు ఇచ్చినట్లు శ్యామ్ కె నాయుడు కోర్టుకు సమర్పించాడు. డాక్యుమెంట్లు చూసి శ్యామ్ కె నాయుడుకి నాంపల్లి సెషన్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. శ్యామ్ కె నాయుడుకి బెయిల్ రద్దు చేయాలంటూ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో శ్రీసుధ కేసు వేసింది. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన తరువాత తనను చెప్పేందుకు కుట్ర చేసి, విజయవాడలో కారు ఆక్సిడెంట్ చేశారంటూ కోర్టుకి తెలిపింది. 


ఈ కేసులో శ్యామ్ కె నాయుడుతో పాటు ఆయన సోదరుడు చోటకే నాయుడు కూడా బెదిరింపులకు దిగుతున్నట్లు శ్రీసుధ ఆరోపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వానికి , శ్యామ్ కె నాయుడుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నెలరోజుల్లో నోటీసులకు సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

 





సినిమాటోగ్రాఫర్‌ శ్యామ్‌ కే నాయుడిపై సినీనటి శ్రీసుధ గతంలో ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాను గతేడాది అతడిపై పెట్టిన కేసు ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐదేళ్లు కలిసి ఉన్న అనంతరం శ్యామ్‌ కే నాయుడు తనను మోసం చేశాడని శ్రీసుధ గతేడాది ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2021-03-03T21:31:32+05:30 IST