ఓటీటీలో ‘బంగార్రాజు’ విజయ విహారం చేస్తోందంటోన్న కింగ్

ABN , First Publish Date - 2022-02-27T03:00:46+05:30 IST

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’. ‘సోగ్గాడు మళ్ళీ వచ్చాడు’ అనేది ఉపశీర్షిక. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి

ఓటీటీలో ‘బంగార్రాజు’ విజయ విహారం చేస్తోందంటోన్న కింగ్

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’. ‘సోగ్గాడు మళ్ళీ వచ్చాడు’ అనేది ఉపశీర్షిక. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. క‌ళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతికి థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను వీక్షకుల కోసం డిజిటల్ తెరపైకి ఫిబ్రవరి 18న ‘జీ 5’లో విడుదల చేసిన విషయం తెలిసిందే. జీ5 లో ప్రసారమవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని, విడుదలైన 7 రోజుల్లో 500 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలతో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతూ బ్లాక్‌బస్టర్‌గా నిలవడం మాకెంతో ఆనందాన్ని ఇచ్చిందని సామాజిక మీడియా ట్విట్టర్ ద్వారా అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, హీరోయిన్ కృతి శెట్టిలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. 


ఈ సందర్భంగా నటుడు, నిర్మాత కింగ్ అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. కోవిడ్ సమయంలో ఈ సినిమా రిలీజ్ చేస్తే ఇబ్బంది పడతారని నా శ్రేయోభిలాషులు సలహాలు ఇచ్చారు. అయితే మా ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రాన్ని సంక్రాంతికే రిలీజ్ చేయడం జరిగింది. ఆ సెంటిమెంట్‌తో కోవిడ్ పరిస్థితులు ఉన్నా కూడా మేము ఎంతో ధైర్యం చేసి ఈ సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ప్రేక్షకుల నుండి మేము ఊహించిన దానికన్నా ఎక్కువ రెస్పాన్స్‌తో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను వీక్షకుల కోసం డిజిటల్ తెరపైకి ఫిబ్రవరి 18 నుంచి ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫామ్ జీ5లో విడుదల చేయడం జరిగింది. జీ5లో స్ట్రీమింగ్ మొదలైన కేవలం 7 రోజుల్లో 500 మిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్ అవ్వడం ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో ఒక సరికొత్త రికార్డ్. ఈ సందర్భంగా బంగార్రాజును ఆదరించిన, ఆదరిస్తున్న, ఆదరించబోతున్న ప్రేక్షకులందరికీ మా టీం తరుపున  కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము..’’ అని తెలిపారు.

Updated Date - 2022-02-27T03:00:46+05:30 IST