సుమంత్ సినిమా ఓటీటీలో..!

ABN , First Publish Date - 2022-01-16T14:20:54+05:30 IST

సుమంత్ సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతుందని తాజా సమాచారం. కరోనా ఒమిక్రాన్ కారణంగా మళ్ళీ పెద్ద సినిమాల రిలీజ్ వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కినేని హీరో సుమంత్ నటించిన లేటెస్ట్ మూవీ 'మళ్లీ మొదలైంది'

సుమంత్ సినిమా ఓటీటీలో..!

సుమంత్ సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతుందని తాజా సమాచారం. కరోనా ఒమిక్రాన్ కారణంగా మళ్ళీ పెద్ద సినిమాల రిలీజ్ వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కినేని హీరో సుమంత్ నటించిన లేటెస్ట్ మూవీ 'మళ్లీ మొదలైంది' నేరుగా ఓటీటీలో రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది. ఈమూవీతో కీర్తి కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇందులో సుమంత్ సరసన నైనా గంగూలీ హీరోయిన్‌గా నటించింది. రెడ్ సినిమాస్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే, 'మళ్లీ మొదలైంది' మూవీని థియేటర్స్‌లో రిలీజ్ చేయాలనుకున్న నిర్మాత ప్రస్తుం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల్ని జీ గ్రూప్ సొంతం చేసుకుంది. మరో నెల రోజుల్లో జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారట. ఇటీవల 'మళ్లీ మొదలైంది' చిత్ర టీజర్ వచ్చి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. చూడాలి అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్‌ను ఎప్పుడు ప్రకటించనున్నారో. 

Updated Date - 2022-01-16T14:20:54+05:30 IST