తెలుగు చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చినా.. దృష్టంతా కోలీవుడ్ పైనే: ‘దృశ్యం 2’ భామ
ABN , First Publish Date - 2021-12-04T03:05:26+05:30 IST
చిన్న గ్యాప్ తర్వాత మళ్ళీ వెండితెరపై కనిపించింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘దృశ్యం-2’ చిత్రాన్ని తెలుగులో హీరో వెంకటేష్ - మీనా జంటగా రీమేక్ చేశారు. ఇందులో
‘బిగ్బాస్’ తమిళం తొలి సీజన్లో పాల్గొని తన నటనా ప్రతిభతో అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్న నటి సుజా వరుణి చిన్న గ్యాప్ తర్వాత మళ్ళీ వెండితెరపై కనిపించింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘దృశ్యం-2’ చిత్రాన్ని తెలుగులో హీరో వెంకటేష్ - మీనా జంటగా రీమేక్ చేశారు. ఇందులో సుజా వరుణి అద్భుతమైన పాత్ర పోషించి, అందరి ప్రశంసలు అందుకుంటోంది. ‘బిగ్బాస్’ తర్వాత పలు చిత్రాల్లో నటించిన సుజా వరుణి.. వివాహం చేసుకుని ఓ బిడ్డకు జన్మనివ్వడంతో చిత్ర పరిశ్రమకు కొంతకాలం దూరమైంది.
ఇపుడు ‘దృశ్యం 2’లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మళ్ళీ ప్రేక్షకులకు దగ్గరవుతోంది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఆమెకు పలు అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన రీఎంట్రీ ఒక తెలుగు చిత్రంలో చిన్నపాత్ర ద్వారా జరిగినప్పటికీ.. తన దృష్టంతా కోలీవుడ్పైనే ఉంటుందని ఆమె తాజాగా వ్యాఖ్యానించింది.