Pan Masala కావాలంటూ Shahrukh, Ajay Devgn కు మనీయార్డర్ పంపిన 19 ఏళ్ల యువతి..!

ABN , First Publish Date - 2022-05-25T18:24:56+05:30 IST

బాలీవుడ్ స్టార్ హీరోలు పాన్ మసాలా యాడ్ చేయడంపై గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే...

Pan Masala కావాలంటూ Shahrukh, Ajay Devgn కు మనీయార్డర్ పంపిన 19 ఏళ్ల యువతి..!

బాలీవుడ్ స్టార్ హీరోలు పాన్ మసాలా యాడ్ చేయడంపై గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. కొన్నేళ్లుగా షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్‌ ఈ ప్రకటనల్లో నటిస్తుండగా.. ఇటీవలే మరో స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ బ్రాండ్ అంబాసిడర్‌గా జాయిన్ అయ్యాడు. ఈ తరుణంలో పలువురు నెటజన్లు అక్షయ్‌పై విమర్శలు చేశారు. దీంతో వెనక్కి తగ్గిన నటుడు క్షమాపణలు సైతం చెప్పాడు. అంతేకాకుండా చట్టపరమైన కారణాల వల్ల యాడ్స్‌ని ఆపలేనని.. కానీ దీని ద్వారా వచ్చిన రెమ్యూనరేషన్‌ని మంచి పనులకి ఉపయోగిస్తానని తెలిపాడు. అంతేకాకుండా మొదటి నుంచే ఈ యాడ్స్‌ చేయొద్దంటూ ఎంతోమంది నెటిజన్లు షారుఖ్, అజయ్‌కి రిక్వెస్టులు పెట్టారు, పెడుతూనే ఉన్నారు. అయితే వారు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. అయితే మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ విద్యార్థిని మాత్రం డిఫరెంట్‌గా ఈ స్టార్స్‌కి ఈ యాడ్స్ విషయమై కౌంటర్ ఇచ్చింది.


ఖార్గోన్‌కు చెందిన 19 ఏళ్ల ధడ్కన్ జైన్ అనే విద్యార్థిని తనకు పాన్ మాసాలా కావాలంటూ సినీ నటులు షారుక్, అజయ్‌కి ఒక్కొక్కరికీ రూ.5లను మనీయార్డర్ చేసింది. వారు ప్రమోట్ చేసే ఆ పాన్ మసాలాని ఆ స్టార్స్ చేతుల మీదుగా తీసుకోవాలకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. అభిమాన నటులు చెప్పడం వల్ల తాను కూడా పాన్ మసాలాని తినాలని భావిస్తున్నట్లు తెలిపింది. మనీయార్డర్‌తోపాటు ఓ మేస్సేజ్‌ని కూడా ఈ నటులకి ధడ్కన్ పంపించింది.


అందులో.. ‘హలో, నేను మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌కి చెందిన ధడ్కన్ జైన్. సార్, మా తల్లిదండ్రులకు నేను ఒకే ఒక్క సంతానం. సర్, పాన్ మసాలా ప్రకటన చేయాలనే మీ నిర్ణయంతో నేను నిరాశ చెందాను. పాన్‌మసాలా యాడ్‌ను వైదొలగలని కోరుతూ గతంలో చాలాసార్లు మీకు ట్వీట్ చేశాను. అయితే దురదృష్టవశాత్తు మీనుంచి ఎలాంటి స్పందన లేవదు. నాకు సోదరులు, సోదరీమణులు ఎవరూ లేరు. కాబట్టి మిమ్మల్ని మీ అన్నయ్యలుగా భావించి.. మే 24న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ డే పాన్ మసాలా యాడ్స్ నుంచి వైదొలగమని రిక్వెస్టు చేస్తున్నాను. ఎందుకంటే మీరు భారతదేశానికి ఓ ప్రతిక. అందుకే ఎంతోమంది యువత మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. అలాంటి వారు మీరు చెప్పారని పాన్ మసాలాని తీసుకుంటే.. వారికి, వారి కుటుంబాలకు ఎంత హాని కలుగుతుందో ఒకసారి ఆలోచించండి.


బీఏ మొదటి సంవత్సరం చదువుతున్న ధడ్కన్ ఈ విషయమై 28 మార్చి 2021న మొదటి ట్వీట్ చేసింది. అప్పటి నుంచి.. ఆమె పుట్టినరోజులు, పండుగల సందర్భంగా ట్వీట్ చేస్తూనే ఉంది. అలాంటి ప్రకటనలు చేయవద్దని ఇద్దరు నటులకు పలుమార్లు విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా.. షారుక్ భార్య గౌరీ ఖాన్‌కి, అజయ్ భార్య కాజోల్‌కి సైతం ధడ్కన్ ట్వీట్స్ చేయడం గమనార్హం.

Updated Date - 2022-05-25T18:24:56+05:30 IST