సెట్లో అడుగు పెట్టారు
ABN , First Publish Date - 2022-06-28T05:51:19+05:30 IST
నయనతార మళ్లీ సెట్లోకి అడుగుపెట్టారు. దర్శకుడు విఘ్నేష్ శివన్తో ఆమె వివాహం జరిగిన తర్వాత ఈ నవదంపతులు దక్షిణాదిలోని...
నయనతార మళ్లీ సెట్లోకి అడుగుపెట్టారు. దర్శకుడు విఘ్నేష్ శివన్తో ఆమె వివాహం జరిగిన తర్వాత ఈ నవదంపతులు దక్షిణాదిలోని ప్రముఖ దేవాలయాలన్నీ సందర్శించి, మొక్కులు తీర్చుకున్నారు. ఆ తర్వాత హనీమూన్ కోసం థాయ్లాండ్ వెళ్లారు. షూటింగ్స్ కోసం ఎన్నోసార్లు థాయ్లాండ్ వెళ్లినా పెళ్లయిన తర్వాత భర్తతో కలసి తొలిసారి అక్కడికి వెళ్లడం కొత్త అనుభూతి కలిగించిందని నయనతార పేర్కొన్నారు. విఘ్నేష్ శివన్తో జాలీ జాలీగా గడిపేసి, దానికి సంబంధించిన ఫొటోలన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసి, మళ్లీ షూటింగ్ కు హాజరయ్యారు. సోమవారం ఆమె థాయ్లాండ్ నుంచి సరాసరి ముంబై చేరుకుని షారుఖ్ ఖాన్ చిత్రం ‘జవాన్’ సెట్లో అడుగుపెట్టారు. తమిళ దర్శకుడు అట్లీ ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. వచ్చే ఏడాది జూన్ 2న హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ‘జవాన్’ విడుదలవుతుంది.