Lokesh Kanagaraj: సినిమాటిక్ యూనివర్స్లో స్టార్ క్రికెటర్..!
ABN , First Publish Date - 2022-11-11T21:11:23+05:30 IST
‘ఖైదీ’ వంటి సినిమాతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj). అతడు దర్శకత్వం వహించిన చిత్రం ‘విక్రమ్’ (Vikram).
‘ఖైదీ’ సినిమాతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj). అతడు దర్శకత్వం వహించిన చిత్రం ‘విక్రమ్’ (Vikram). ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. లోకేశ్ ‘ఖైదీ’, ‘విక్రమ్’ వంటి సినిమాలతో సినిమాటిక్ యూనివర్స్ను రూపొందిస్తున్నాడు. ఈ యూనివర్స్లో సూర్య, కార్తి, కమల్ హాసన్ ఇప్పటికే చేరారు. కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదలపతి విజయ్ ఈ యూనివర్స్లో త్వరలోనే చేరనున్నాడు. ఓ స్టార్ క్రికెటర్ కూడా లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం అందుతుంది.
టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ (Dhoni) లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్లో చేరునున్నట్టు కోలీవుడ్ మీడియా తెలుపుతుంది. ధోనీ ప్రస్తుతం కోలీవుడ్లో సినిమాలను నిర్మించనున్నాడు. ఓ ప్రొడక్షన్ హౌస్ను స్థాపించాడు. సినిమాటిక్ యూనివర్స్లో చేరాలంటే ధోనీ ఓ సినిమాలో నటించాలి. మరి ఈ మాజీ క్రికెటర్ మూవీలో కనిపిస్తాడా లేదా అంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం లోకేశ్ కనకరాజ్ వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ‘దళపతి 67’, ‘ఖైదీ 2’, ‘విక్రమ్ 2’ వంటి తదితర ప్రాజెక్టులకు దర్శకత్వం వహించనున్నాడు. ఒకవేళ ధోనీతో కనుక సినిమా చేయాలంటే ఏడేళ్ల తర్వాతనే వీలవుతుంది. లోకేశ్ కనకరాజ్ ప్రస్తుతం ‘దళపతి 67’ ను తెరకెక్కించనున్నాడు. ఈ మూవీ షూటింగ్ డిసెంబర్ 4న ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో ఐదుగురు విలన్స్కు చోటుందని తెలుస్తోంది. గౌతమ్ వాసుదేవ మీనన్, సంజయ్ దత్, అర్జున్ ఈ పాత్రలను పోషించనున్నారని తెలుస్తోంది. త్రిష, నివీన్ పాలీ, విశాల్ ఇతర కీలక రోల్స్లో కనిపించనున్నారు.