రేర్ పిక్: కలిసి భోజనం చేస్తోన్న కమెడియన్స్

ABN , First Publish Date - 2021-05-09T04:43:28+05:30 IST

శ్రీకాంత్ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ‘ఆహ్వానం’ చిత్ర షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలోని మండువా లోగిలి సెట్లో జరుగుతోంది. లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడైతే బ్రేక్ ఇవ్వగానే ఎవరి కార్‌వ్యాన్‌లోకి వాళ్ళు వెళ్లి లంచ్ చేస్తున్నారు. కానీ ఆ రోజుల్లో

రేర్ పిక్: కలిసి భోజనం చేస్తోన్న కమెడియన్స్

శ్రీకాంత్ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ‘ఆహ్వానం’ చిత్ర షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలోని మండువా లోగిలి సెట్లో జరుగుతోంది. లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడైతే బ్రేక్ ఇవ్వగానే ఎవరి కార్‌వ్యాన్‌లోకి వాళ్ళు వెళ్లి లంచ్ చేస్తున్నారు. కానీ ఆ రోజుల్లో అలా ఉండేది కాదు. సెట్‌లో ఉన్న ఆర్టిస్ట్‌లందరూ ఒకే చోట కూర్చుని భోజనం చేసేవారు. ఇళ్ల దగ్గర నుంచి వచ్చిన క్యారియర్‌లోని ఐటమ్స్ వడ్డించుకొంటూ, కబుర్లు చెప్పుకుంటూ తినేవారు. ఇలా తినే సందర్భంలోనిదే ఈ పిక్. ఈ పిక్‌లో కమెడియన్స్ అందరూ ఒకచోట చేరి కలిసి భోజనం చేస్తున్నారు. వారి ఇంటి నుంచి వచ్చిన ఐటమ్స్‌ని షేర్ చేసుకుంటూ ఆరగిస్తున్నారు. కోట శ్రీనివాసరావు, ఏవీఎస్, తనికెళ్ల భరణి, గుండు హనుమంతరావు భోజనం చేస్తుంటే.. అలీ వారికి వడ్డిస్తున్నారు. చూడండి.. ఆర్టిస్ట్‌ల మధ్య ఎంత చక్కటి వాతావరణం ఉందో.. ప్రస్తుత కాలంలో ఇలాంటి పిక్స్ పట్టుకోవడం మాత్రం చాలా కష్టం సుమీ. 



Updated Date - 2021-05-09T04:43:28+05:30 IST