SSMB 30: మహేశ్ వారికే కమిటయ్యారా..?

ABN , First Publish Date - 2022-06-15T16:11:04+05:30 IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) ఇటీవల వచ్చిన సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమాతో మంచి హిట్ అందుకున్నారు.

SSMB 30: మహేశ్ వారికే కమిటయ్యారా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Super Star Mahesh Babu) ఇటీవల వచ్చిన సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. ఈ క్రమంలో తన తదుపరి సినిమాను మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాగా ఈ మూవీ రూపొందనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి 'అర్జునుడు' (Arjunudu) అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. SSMB 28 గా తెరకెక్కుతున్న ఇందులో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటించబోతుంది. ఎస్ ఎస్ థమన్ (S S Thaman) సంగీతం అందిస్తున్నారు.


అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ కంప్లీట్ అయ్యాక దర్శకధీరుడు రాజమౌళితో మహేశ్ తన మొదటి పాన్ ఇండియా సినిమాను చేయబోతున్నారు. శ్రీదుర్గ ఆర్ట్స్ పతాకంపై డా.కె.ఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఇప్పటికే, ఈ సినిమాకు బడ్జెట్, బాక్సాఫీస్ వద్ద చేసే వసూళ్ల లెక్కలు గురించి ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు. SSMB 29 వ చిత్రంగా ఇది రూపొందిస్తారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో ఉంటుందని సమాచారం.


అయితే, ఇటీవల మహేశ్ బాబుకు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ప్రత్యేకంగా కలుసుకుని SSMB 30 కి గానూ 50 కోట్ల అడ్వాన్స్ ఇవ్వడానికి కమిట్మెంట్ తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. 30 వ చిత్రాన్ని తమ సంస్థలోనే చేయాలని మహేశ్ బాబుతో అగ్రిమెంట్ చేసుకున్నట్లుగా సమాచారం. దర్శకుడు ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ రానప్పటికీ.. మహేశ్ బాబుతో సినిమా చేయాలని ఇదివరకే, పూరి జగన్నాథ్, సందీప్ రెడ్డి వంగ, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, సుకుమార్ ఇలా కొంతమంది దర్శకులు చర్చలు జరిపారు. వీరిలో ఒకరు ఈ ప్రాజెక్ట్‌కు ఫైనల్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి దీనిపై అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడుస్తుందో చూడాలి. కాగా, మహేశ్ నటించిన లేటెస్ సినిమా సర్కారు వారి పాటకు మైత్రీ వారు నిర్మాణంలో భాగమైన సంగతి తెలిసిందే. 

Updated Date - 2022-06-15T16:11:04+05:30 IST