సెంటిమెంట్తో శ్రీరంగపురం
ABN , First Publish Date - 2022-05-24T06:00:37+05:30 IST
వినాయక్ దేశాయ్, పాయల్ ముఖర్జీ, వైష్ణవి సింగ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘శ్రీరంగపురం’. ఎం. ఎస్. వాసు దర్శకత్వంలో...
వినాయక్ దేశాయ్, పాయల్ ముఖర్జీ, వైష్ణవి సింగ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘శ్రీరంగపురం’. ఎం. ఎస్. వాసు దర్శకత్వంలో చిందనూరు నాగరాజు నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ చిత్రం ట్రైలర్ను దర్శకుడు వి. సముద్ర విడుదల చేసి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. మేనకోడలు, మేనమామ బంధం ఎంత గొప్పదో, ఎంత బాధ్యతతో కూడినదో తెలిపే కథతో తెరకెక్కించామని ఎం.ఎస్ వాసు తెలిపారు. గోరింటాకు తరహాలో బెస్ట్ సెంటిమెంట్ చిత్రంగా నిలిచిపోతుందని, కుటుంబ విలువలు, అనుబంధాల నేపథ్యంలో ‘శ్రీరంగపురం’ చిత్రాన్ని దర్శకుడు అద్భుతంగా మలిచాడు అని వినాయక్ దేశాయ్ అన్నారు.