టాలీవుడ్ సింగర్కు తీవ్ర లక్షణాలతో కరోనా!
ABN , First Publish Date - 2022-01-28T16:02:18+05:30 IST
కరోనా మహమ్మారికి భయపడి ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా మహమ్మారి ఎవరినీ వదిలిపెట్టడంం లేదు. తాజాగా తెలుగు సింగర్ కౌసల్యకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
కరోనా మహమ్మారికి భయపడి ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా మహమ్మారి ఎవరినీ వదిలిపెట్టడంం లేదు. తాజాగా తెలుగు సింగర్ కౌసల్యకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘‘నాకు కరోనా అని తేలింది. లక్షణాలు తీవ్రంగానే ఉన్నాయి. రెండు రోజులుగా జ్వరం ఉంది. కనీసం మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి. ఇప్పుడు గొంతు నొప్పి ఎంతగానో ఇబ్బందిపెడుతోంది. గురువారం నుంచి మందులు వాడుతున్నా. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి’ అని కౌసల్య ఇన్స్టాలో రాసుకొచ్చారు.