సిద్దార్థ్ పోస్ట్మార్టం నివేదికలో ఏముంది?
ABN , First Publish Date - 2021-09-03T22:59:01+05:30 IST
బాలీవుడ్ నటుడు, ‘బిగ్బాస్–13’ విజేత సిద్దార్థ్ శుక్లా గురువారం మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మృతదేహానికి పోస్ట్మార్టం పూర్తయింది. వైద్యుల సమక్షంలో పోలీస్ అధికారులు పోస్ట్మార్టంను చిత్రీకరించారు. అనంతరం పంచనామా నివేదికను పోలీసులకు అందజేశారు.
బాలీవుడ్ నటుడు, ‘బిగ్బాస్–13’ విజేత సిద్దార్థ్ శుక్లా గురువారం మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మృతదేహానికి పోస్ట్మార్టం పూర్తయింది. వైద్యుల సమక్షంలో పోలీస్ అధికారులు పోస్ట్మార్టంను చిత్రీకరించారు. అనంతరం పంచనామా నివేదికను పోలీసులకు అందజేశారు. ఆ నివేదికలో సిద్దార్థ్ మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని వైద్యులు నిర్థారించినట్లు సమాచారం. దీంతో ఆయన గుండెపోటుతోనే మృతి చెందారని భావిస్తున్నారు. బాలికా వధూ సీరియల్తో గుర్తింపు తెచ్చుకున్న సిద్ధార్థ్ ‘బిగ్బాస్’ రియాల్టీ షోలో పాల్గొని భారీ క్రేజ్ సొంతం చేసుకున్నారు. ‘బిగ్బాస్’ షోలో సిద్దార్థ్ శుక్లాకు షెహనాజ్తో పరిచయం ఏర్పడింది. అలలావాళ్లిద్దరూ స్నేహితులయ్యారు.ఆ తర్వాతా ఇద్దరూ ప్రేమలో ఉన్నారనీ, త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారని వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే సిద్దార్థ్ ఆకస్మిక మరణంతో షెహనాజ్ షాక్కు గురైందని.. ఎవ్వరితోనూ మాట్లాడాలనుకోవడం లేదని.. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసిందనీ ఆమె ేస్నహితులు తెలిపారు.