విమానంలో హీరోయిన్కు షాకింగ్ అనుభవం.. పైన పెట్టిన బ్యాగ్ను తీసుకుంటుండగా ఎవరో అసభ్యంగా తడిమినట్టు అనిపించడంతో..
ABN , First Publish Date - 2021-10-20T21:15:54+05:30 IST
లైంగిక వేధింపులు అనేవి మహిళలకు ప్రతి చోట ఎదురవుతున్నాయి. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు తనతో ఒక వ్యాపారవేత్త అసభ్యంగా ప్రవర్తించాడని తాజాగా ఒక హీరోయిన్ ఆరోపించిది.
లైంగిక వేధింపులు అనేవి మహిళలకు ప్రతి చోట ఎదురవుతున్నాయి. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు తనతో ఒక వ్యాపారవేత్త అసభ్యంగా ప్రవర్తించాడని తాజాగా ఒక హీరోయిన్ ఆరోపించిది. గతంలో దంగల్ హీరోయిన్ జైరా వసీంకు ఇటువంటి అనుభవమే ఎదురైంది. ఫలితంగా ట్విట్టర్లో ఆమె తన బాధను వెళ్లగక్కింది. వివరాల్లోకి వెళ్లితే..
ఘజియాబాద్కు చెందిన ఒక వ్యాపారవేత్త విమానంలో ఒక హీరోయిన్పై వేధింపులకు పాల్పడ్డాడు. అక్టోబర్ 3న ఢిల్లీ నుంచి ముంబయికి వెళ్తున్నప్పుడు ఆ ఘటన చోటు చేసుకుందని ఆమె ఆరోపించింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..ముంబైలో విమానం ల్యాండ్ అయ్యే సమయంలో బ్యాగ్ తీసుకోడానికి ఆమె ప్రయత్నించింది. బ్యాగ్ తీసుకుంటుండగా ఆ వ్యాపారవేత్త తనను అసభ్యంగా తడిమడాని ఆమె చెప్పింది. దీంతో అతడిపై వెంటనే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సంఘటన గురించి క్యాబిన్ క్రూకు ఆమె తెలిపింది. మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయమని వారు ఆమెకు సలహా ఇచ్చారు. దీంతో అతడికి వ్యతిరేకంగా సహారా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు అనంతరం నిందితుడు ఆమెకు క్షమాపణ చెప్పాడని క్యాబిన్ క్రూ చెప్పారు. వ్యాపారవేత్తకు వ్యతిరేకంగా కేసును నమోదు చేశామన్నారు. దర్యాప్తు జరుగుతున్న సమయంలో నిందితుడు తన పేరును తప్పుగా చెప్పడన్నారు. మొదట్లో నిందితుడు తన పేరును రాజీవ్గా చెప్పాగా, దర్యాప్తు అనంతరం నితిన్గా తేలిందన్నారు. పోలీసులు నితిన్ ఫొటోలను హీరోయిన్కి చూపించగా ఆమె గుర్తుపట్టిందన్నారు. నిందితుణ్ని అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరుపరిచామన్నారు. అనంతరం అతడిని 3రోజుల జ్యూడిషీయల్ రిమాండ్కు తరలించామన్నారు.