బిగ్బాస్ నటికి మరో సినిమా ఛాన్స్
ABN , First Publish Date - 2022-01-21T03:16:50+05:30 IST
ఆర్.జె. బాలాజీ చిన్నచిన్న హాస్య పాత్రలు వేస్తూ సినీ కెరీర్ను ప్రారంభించి ఆ తర్వాత ‘ఎల్కేజీ’ అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యారు. తరువాత లేడీ సూపర్స్టార్ నయనతార ప్రధాన పాత్రలో ‘మూక్కుత్తి అమ్మన్’ అనే చిత్రాన్ని తెరకెక్కించి..
బిగ్బాస్ తమిళం నాలుగో సీజన్లో పాల్గొన్న నటి శివానీ నారాయణన్కు మరో సినిమా అవకాశం వరించింది. దర్శకుడు ఆర్.జె. బాలాజీ తెరకెక్కించనున్న చిత్రంలో హీరోయిన్గా శివానీని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని శివానీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. దర్శకుడు బాలాజీతో కలిసి తాను దిగిన ఫొటో షేర్ చేస్తూ ఈ విషయాన్ని ఆమె వెల్లడించారు.
ఆర్.జె. బాలాజీ చిన్నచిన్న హాస్య పాత్రలు వేస్తూ సినీ కెరీర్ను ప్రారంభించి ఆ తర్వాత ‘ఎల్కేజీ’ అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యారు. తరువాత లేడీ సూపర్స్టార్ నయనతార ప్రధాన పాత్రలో ‘మూక్కుత్తి అమ్మన్’ అనే చిత్రాన్ని తెరకెక్కించి బ్లాక్బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇపుడు తన తరువాత ప్రాజెక్టులు చేపట్టారు. ఇందులో శివానీ నారాయణన్ను హీరోయిన్గా ఎంపిక చేశారు. ఇదిలావుంటే, శివానీ మరో చిత్రంలో కూడా నటిస్తోంది. కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విక్రమ్’ చిత్రంలో విజయ్ సేతుపతికి జోడీగాను, దర్శకుడు పొన్రామ్ చిత్రంలో పోలీస్ పాత్రలో కనిపించనుంది.