కెరీర్‌పైనే శింబు ఫోకస్‌ మొత్తం

ABN , First Publish Date - 2022-01-23T19:37:03+05:30 IST

తమిళ హీరో శింబు కెరీర్‌పైనే ఫోకస్‌ మొత్తం పెట్టారు. గత ఏడాది ‘మానాడు’ చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న క్రేజీ హీరో టీఆర్‌.సిలంబరసన్‌ (శింబు) తన దృష్టినంతా సినీ కెరీర్‌పైనే కేంద్రీకరించాడు.

కెరీర్‌పైనే శింబు ఫోకస్‌ మొత్తం

తమిళ హీరో శింబు కెరీర్‌పైనే ఫోకస్‌ మొత్తం పెట్టారు. గత ఏడాది ‘మానాడు’ చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న క్రేజీ హీరో టీఆర్‌.సిలంబరసన్‌ (శింబు) తన దృష్టినంతా సినీ కెరీర్‌పైనే కేంద్రీకరించాడు. ప్రస్తుతం ‘వెందు తుణిందదు కాడు’, ‘కరోనా కుమార్‌’, ‘పత్తు తల’ వంటి చిత్రాల్లో ఆయన నటిస్తున్నాడు. ఈ చిత్రాల షూటింగ్‌ కూడా చాలావరకు పూర్తయింది. దీంతో తన తదుపరి ప్రాజెక్టుల కోసం పలువురు దర్శకులు చెప్పే కథలను వింటున్నాడు. వారిలో అశ్వత్‌ మారిముత్తు ఒకరు. ఈయన గతంలో అశోక్‌ సెల్వన్‌ - రిత్తికా సింగ్‌ జంట గా ‘ఓ మై కడవులే’ అనే చిత్రాన్ని తెరకెక్కించగా, ఘన విజయం సాధించింది. దీంతో తన కొత్త సినిమాను అశ్వత్‌ దర్శకత్వంలో ప్రారంభించేందుకు శింబు ప్లాన్‌ చేసి, కాల్షీట్‌ కూడా కేటాయించినట్టు కోలీవుడ్‌ మీడియా వర్గాల సమాచారం. అలాగే, ఇందులో ప్రముఖ హీరోయిన్‌ను ఎంపిక చేసేందుకు సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని తెలుస్తోంది.

Updated Date - 2022-01-23T19:37:03+05:30 IST