అశ్లీల చిత్రాల రాకెట్ కేసులో సంచలన విషయాలు

ABN , First Publish Date - 2021-07-21T16:35:05+05:30 IST

అశ్లీల చిత్రాల రాకెట్ కేసులో హిందీ కథానాయిక శిల్పాశెట్టి బర్త రాజ్‌కుంద్రా దందాలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

అశ్లీల చిత్రాల రాకెట్ కేసులో సంచలన విషయాలు

హైదరాబాద్: అశ్లీల చిత్రాల రాకెట్ కేసులో హిందీ కథానాయిక శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా దందాలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో బ్రిటన్‌లోని తన బంధువు ప్రదీప్ భక్షితో రాజ్‌కుంద్రా కలిసి ఈ వ్యవహారం నడుపుతున్నట్లు గుర్తించారు. వాట్సప్ చాటింగ్, ఈ మెయిల్స్ ద్వారా ఈ వ్యవహారం బయటకు వచ్చింది. బాలీవుడ్‌లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న మోడల్స్‌ను టార్గెట్ చేసుకుని అశ్లీల చిత్రాల్లో నటించేలా బలవంతం చేసి వాటిని చిత్రీకరిస్తున్నట్లు గుర్తించారు. ఈ పోర్న్ వీడియోలను బ్రిటన్‌లోని హాట్ షాట్ అనే యాప్ ద్వారా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. పోర్న్ చిత్రాల్లో నటించిన వారికి పారితోషికాలు ఇచ్చేందుకు హెచ్ అకౌంట్ పేరుతో ఓ వాట్సాప్ గ్రూపు పెట్టారు. వీడియోలను చూసేందుకు చందాదారుల నుంచి రాజ్‌కుంద్రా డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. 


అశ్లీల చిత్రాలకు సంబంధించిన కేసులో రాజ్‌‌కుంద్రాను ముంబై పోలీసులు సోయవారం సాయంత్రం అరెస్ట్‌ చేశారు. రాజ్‌ కుంద్రా అరెస్ట్‌ తర్వాత గతంలో ఆయన చేసిన ట్వీట్లు వైరల్‌ అవుతున్నాయి. ‘‘పోర్న్‌ వర్సెస్‌ ప్రాస్టిట్యూషన్‌... కెమెరాలో శృంగారం చేస్తున్న వ్యక్తులను చూడటం కోసం డబ్బు చెల్లించడం ఎందుకు చట్టబద్ధం కాదు? అందుకు ఇంకొకటి (నేరుగా ఓ వ్యక్తికి డబ్బులిచ్చి శృంగారం చేయడం) ఎందుకు భిన్నమైనది?’ అని మార్చి 29, 2012లో రాజ్‌ కుంద్రా ట్వీట్లు చేశారు. అదే ఏడాది మే 3న ‘‘యాక్టర్లు క్రికెట్‌ ఆడుతున్నారు. క్రికెటర్లు రాజకీయాల్లోకి వస్తున్నారు. రాజకీయ నాయకులు అశ్లీల చిత్రాలు చూస్తున్నారు. అశ్లీల చిత్రాల్లో నటించిన తారలు యాక్టర్లు అవుతున్నారు’’ అని మరో ట్వీట్‌ చేశారు.

Updated Date - 2021-07-21T16:35:05+05:30 IST