Sherlyn Chopraపై న్యాయపరమైన చర్యలు.. రూ.50 కోట్లు పరవు నష్టం దావా వేసిన Shilpa Shetty

ABN , First Publish Date - 2021-10-19T21:19:27+05:30 IST

బాలీవుడ్ వెటరన్ బ్యూటీ శిల్పాశెట్టి మళ్లీ భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల నిర్మాణం కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే.

Sherlyn Chopraపై న్యాయపరమైన చర్యలు.. రూ.50 కోట్లు పరవు నష్టం దావా వేసిన Shilpa Shetty

బాలీవుడ్ వెటరన్ బ్యూటీ శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల నిర్మాణం కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన శిల్పాశెట్టి భర్తను విడిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. కొన్ని రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉంది. ఎట్టకేలకు రాజ్‌కుంద్రా బెయిల్‌పై విడుదలైన తర్వాత మళ్లీ ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చింది. మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారింది. తన కొత్త లుక్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తోంది. 


అలాగే తమపై అసత్య ఆరోపణలు చేసిన బాలీవుడ్ హాట్ భామ షెర్లిన్ చోప్రాపై పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమవుతోంది. రాజ్, శిల్పా లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఎన్నో అక్రమాలు చేశారని షెర్లిన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతేకాదు రాజ్‌పై జుహూ పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా పెట్టింది. ప్రెస్ మీట్ పెట్టి మరీ శిల్ప, రాజ్‌లపై విమర్శలు గుప్పించింది. ఈ నేపథ్యంలో శిల్ప, రాజ్ ఆమెపై న్యాయపరమైన చర్యలకు దిగారు. రూ.50 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. శిల్ప, రాజ్‌పై షెర్లిన్ చేసిన ఆరోపణలు అవాస్తవమైనవని, వారిని కించపరిచి డబ్బులు డిమాండ్ చేసేందుకే ఆమె విమర్శలు చేసిందని, ఆమెపై న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్నామని శిల్ప తరఫు న్యాయవాది చెప్పారు. 

Updated Date - 2021-10-19T21:19:27+05:30 IST