గుర్రంపై వైష్ణోదేవి దర్శనానికి శిల్పాశెట్టి
ABN , First Publish Date - 2021-09-17T21:31:43+05:30 IST
శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాపై అశ్లీల వీడియోల కేసులో విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే! శిల్పాశెట్టి తన భర్తకు విడాకులు ఇవ్వబోతుందనే వార్తలూ వచ్చాయి. అయితే తాజాగా దైవ దర్శనం కోసం జమ్ముకశ్మీర్కు వెళ్లారు శిల్పాశెట్టి. తన స్నేహితురాలు ఆకాంక్ష మల్హోత్రాతో కలిసి వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించుకున్నారు.
శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాపై అశ్లీల వీడియోల కేసులో విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే! శిల్పాశెట్టి తన భర్తకు విడాకులు ఇవ్వబోతుందనే వార్తలూ వచ్చాయి. అయితే తాజాగా దైవ దర్శనం కోసం జమ్ముకశ్మీర్కు వెళ్లారు శిల్పాశెట్టి. తన స్నేహితురాలు ఆకాంక్ష మల్హోత్రాతో కలిసి వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ గుర్రపు స్వారీ చేస్తూ ఆమె దర్శనానికి వెళ్లారు. వైష్ణోదేవీ ఆలయంలో శిల్పాశెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘‘అమ్మవారి పిలుపు, ఆశీస్సుల మేరకు దర్శనానిని వచ్చాను’’ అని ఆమె తెలిపారు.
మరోపక్క రాజ్కుంద్రా కేసులో గురువారం ముంబై పోలీసులు సాక్షిగా చార్జ్షీట్లో శిల్పాశెట్టి పేరు నమోదు చేశారు. తన బిజీ షెడ్యూల్స్ వల్ల రాజ్కుంద్రా ఏం చేస్తుండేవాడో, ఎప్పుడు ఏం చేస్తాడో తనకు తెలియదని శిల్పా పేర్కొంది. హాట్షాట్స్, బాలీఫేమ్ యాప్స్ గురించి కూడా తెలియదని ఆ స్టేట్మెంట్లో పేర్కొంది.