శర్వానంద్ టైమ్ట్రావెల్?
ABN , First Publish Date - 2021-07-29T07:59:18+05:30 IST
కథానాయకుడిగా స్టార్డమ్ను కాపాడుకుంటూనే విలక్షణమైన కథలతో ఆకట్టుకుంటున్నారు శర్వానంద్. ప్రస్తుతం కిశోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్ కథానాయకుడిగా...
కథానాయకుడిగా స్టార్డమ్ను కాపాడుకుంటూనే విలక్షణమైన కథలతో ఆకట్టుకుంటున్నారు శర్వానంద్. ప్రస్తుతం కిశోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సెట్స్పై ఉంది. తమిళ, తెలుగు భాషల్లో రూపొందే ‘మహా సముద్రం’లో కూడా ఆయన నటిస్తున్నారు. శర్వానంద్ నటించబోయే తదుపరి చిత్రం ఓ విభిన్నమైన కథాంశంతో తెరకెక్కబోతోందని సమాచారం. టైమ్ట్రావెల్ నేపథ్యంలో రూపొందుతున్న కొత్త చిత్రానికి శర్వా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటిదాకా వచ్చిన టైమ్ ట్రావెల్ చిత్రాలకు భిన్నమైన కథతో ఈ చిత్రం తెరకెక్కనుందని, అందులో కథానాయకుడు తన బాల్యంలోకి వెళ్లి స్కూలు, కాలేజీ రోజుల్లో తమ జీవిత విధానాలను గమనిస్తారని తెలుస్తోంది. కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.