Sharwanand: స్పీడు పెంచిన శర్వానంద్
ABN , First Publish Date - 2021-07-20T16:42:16+05:30 IST
యువ కథానాయకుడు శర్వానంద్.. సినిమాలను వేగంగా పూర్తి చేసే పనిలో పడ్డాడు. కొవిడ్ సమయంలో షూటింగ్స్కు దూరంగా ఉన్న ఈ హీరో పరిస్థితులు కాస్త కుదుటపడగానే...
యువ కథానాయకుడు శర్వానంద్.. సినిమాలను వేగంగా పూర్తి చేసే పనిలో పడ్డాడు. కొవిడ్ సమయంలో షూటింగ్స్కు దూరంగా ఉన్న ఈ హీరో పరిస్థితులు కాస్త కుదుటపడగానే ‘మహా సముద్రం’ సినిమా షూటింగ్ను పూర్తి చేశాడు. ఇది పూర్తయిన కొన్ని రోజులకే కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ షూటింగ్లో బిజీ అయ్యాడు. ఈ సినిమా షూటింగ్ మంగళవారం నుంచి ప్రారంభమైంది. దీనికి సంబంధించిన లొకేషన్ ఫొటోను చిత్ర యూనిట్ షేర్ చేసింది. ఇందులో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న, డైరెక్టర్ తిరుమల కిషోర్ను చూడొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.