‘ఆహా’లో సేనాపతి!
ABN , First Publish Date - 2021-12-27T02:13:35+05:30 IST
100 శాతం తెలుగు స్ర్టీమింగ్ ప్లాట్ఫామ్ ‘ఆహా’ త్వరలోనే అచ్చమైన తెలుగు వెబ్ ఒరిజినల్ సినిమా ‘ేసనాపతి’తో అలరించనుంది. సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఓటీటీలో అడుగుపెడుతున్న చిత్రమిది. క్రైమ్ ు డ్రామా జోనర్లో సాగే ఈ చిత్రాన్ని పవన్ సాధినేని దర్శకత్వం వహించారు.
100 శాతం తెలుగు స్ర్టీమింగ్ ప్లాట్ఫామ్ ‘ఆహా’ త్వరలోనే అచ్చమైన తెలుగు వెబ్ ఒరిజినల్ సినిమా ‘సేనాపతి’తో అలరించనుంది. సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఓటీటీలో అడుగుపెడుతున్న చిత్రమిది. క్రైమ్ ు డ్రామా జోనర్లో సాగే ఈ చిత్రాన్ని పవన్ సాధినేని దర్శకత్వం వహించారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుష్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మించారు. ఈ నెల 31న ఆహాలో స్ర్టీమింగ్ కానుందీ చిత్రం. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘‘మా కుటుంబం నుంచి చాలా మంది హీరోలు ఉన్నా నిర్మాణ సంస్థలు ఒకట్రెండే ఉన్నాయి. ఇప్పుడు సుష్మిత కొణిదెల విష్ణు వంటి వాళ్లు కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ అనే ప్రొడక్షన్ హౌస్నుప్రారంభించడం ఆనందంగా ఉంది. రాజేంద్రప్రసాద్కి నాకు మధ్య 45 ఏళ్ల అనుబంధం ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఇద్దరికీ పనిచేయాలనే తప్పన చావలేదు. ఇప్పటికీ ఎందుకు పని చేస్తుంటారు? అని నన్ను చాలా మంది అడుగుతుంటారు. పని చేయకపోతే మూలనపడిపోతానేమో అని భయం నాకు. పవన్ సాధినేని టాలెంట్ తెలుసు. తను మా బ్యానర్లో సినిమా కూడా చేయబోతున్నాడు’’ అని అన్నారు. ‘‘నా 45 ఏళ్ల సినీ కెరీర్లో మంచి మిత్రుడు అంటే చిరంజీవిగారే. నవరసాల్లో యాక్షన్, కామెడీ అనే రసాలు కారణంగా నేను, చిరంజీవి నిలిచిపోయాం. నాకు, అరవింద్గారికి పని లేకపోతే మేం బతికిఉన్నట్లే కాదు. 45 ఏళ్ల ప్రయాణం తర్వాత కూడా నాకు ఇంకా పని దొరుకుతుందంటే కారణం.. నేటి దర్శకులు టెక్నిషియన్లే. రాజేంద్ర ప్రసాద్ ఇలా కూడా ఉంటాడా? అని ేసనాపతి సినిమా చూేస్త అనిపిస్తుంది. నాకంటే యంగర్ జనరేషన్ అయిన టీమ్తో పనిచేశాను. వాళ్లు ఇన్స్పిరేషన్ ఇస్తూ వర్క్ చేయించుకున్నారు’’ అని రాజేంద్రప్రసాద్ అన్నారు. ‘‘ఆహాతో మేం కొలాబ్రేట్ అవుతున్న తొలి ప్రాజెక్ట్ ఇది. రాజేందప్రసాద్గారితో సినిమా చేయడం చాలా స్పెషల్గా అనిపించింది.’’ అని సుస్మిత కొణిదెల అన్నారు.