Radhe shyam: సెకండ్ సింగిల్ వచ్చేసింది..

ABN , First Publish Date - 2021-12-02T17:26:23+05:30 IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'రాధే శ్యామ్. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పీరియాడికల్

Radhe shyam: సెకండ్ సింగిల్ వచ్చేసింది..

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'రాధే శ్యామ్. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరిగా రానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్న ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ నిర్వహిస్తోంది చిత్రబృందం. ఇందులో భాగంగా ఇటీవలే ఫస్ట్ సింగిల్ 'ఈ రాతలే' లిరికల్ వీడియో సాంగ్ వచ్చి యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇదే క్రమంలో ఇప్పుడు సెకండ్ సింగిల్ నగుమోమూ తారలే అంటూ సాగే సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అంతేకాదు తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ వెర్షన్‌లోనూ ఈ సాంగ్ విడుదలై ఆకట్టుకుంటోంది. క్రేజీ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన ఈ సాంగ్‌కు కృష్ణకాంత్ సాహిత్యం అందించగా, జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందింసమకూర్చారు. సాంగ్ మొత్తం మంచి విజువల్ ట్రీట్‌లా అనిపిస్తూ బాగా ట్రెండ్ అవుతోంది.  



Updated Date - 2021-12-02T17:26:23+05:30 IST