Sarkaru Vaari Paata: మరోసారి వాయిదా..నిజమెంత..?

ABN , First Publish Date - 2022-01-16T18:27:43+05:30 IST

'సర్కారు వారి పాట' మరోసారి వాయిదా..! ప్రస్తుతం సోషల్ మిడియాలో ఇదే వార్త చకర్లు కొడుతోంది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్' విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Sarkaru Vaari Paata: మరోసారి వాయిదా..నిజమెంత..?

'సర్కారు వారి పాట' మరోసారి వాయిదా..! ప్రస్తుతం సోషల్ మిడియాలో ఇదే వార్త చకర్లు కొడుతోంది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్' విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి - రామ్ చరణ్‌ల 'ఆచార్య' చిత్రం కూడా వాయిదా పడి ఏప్రిల్ 1న రీ షెడ్యూల్ అయింది. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా రూపొందుతున్న 'సర్కారు వరి పాట' చిత్రం కూడా మరోసారి వాయిదా పడుతుందని టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం ఇంకా 40 రోజుల వరకు చిత్రీకరణ జరపాల్సి ఉండటంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కూడా పూర్తి చేయాల్సి ఉండటమేనట.


ప్రస్తుతం మహేశ్ రెస్ట్‌లో ఉన్నారు. ఇప్పుడు థర్డ్ ఎఫెక్ట్ బాగా ఉంది. ఇవన్నీ సద్దుమణిగిన తర్వాత సర్కారు వారి పాట షూటింగ్ పూర్తి చేస్తారని సమాచారం. దీనిని బట్టి చూస్తే సమ్మర్‌కు కూడా ఈ సినిమా రావడం కష్టమని తెలుస్తోంది. ఒకవేళ రెడీ అయినా 'ఆర్ఆర్ఆర్' మూవీతో పాటు మిగతావీ రీ షెడ్యూల్ అవుతాయి. సోలో డేట్ దొరకడం అంత ఈజీ కాదు. ఈ రకంగా చూస్తే ఏ ఆగస్టులోనో  సెప్టెంబర్‌లోనో ప్రేక్షకుల ముందుకు రావచ్చునని అంచనా. మరి మేకర్స్ ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి.  

Updated Date - 2022-01-16T18:27:43+05:30 IST