Sarkaru vaari paata: స్పెయిన్ దేశానికి పయనం..!

ABN , First Publish Date - 2021-09-26T16:39:35+05:30 IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట'. ఈ మూవీ కొత్త షెడ్యూల్ కోసం చిత్రబృందం స్పెయిన్‌కు పయనం అవనున్నట్టు సమాచారం.

Sarkaru vaari paata: స్పెయిన్ దేశానికి పయనం..!

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట'. ఈ మూవీ కొత్త షెడ్యూల్ కోసం చిత్రబృందం స్పెయిన్‌కు పయనం అవనున్నట్టు సమాచారం. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న ఈమూవీకి సంబంధించిన ఆసక్తికర అంశాలను ఇటీవల జరిపిన ప్రెస్ మీట్‌లో మహేష్ వెల్లడించారు. 'పోకిరి' వంటి బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని చెప్పుకొచ్చారు. అలాగే చిత్ర షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తయినట్టు..ఇందులో కొత్త మహేష్‌ను చూడబోతున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో షెడ్యూల్ పూర్తి చేసిన చిత్ర యూనిట్ త్వరలో నెక్స్ట్ షెడ్యూల్ కోసం స్పెయిన్ దేశానికీ పయనమవ్వనున్నారట. దాదాపు మూడు వారాల పాటు అక్కడ చిత్రీకరణ జరపనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ మూవీకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నాయి.

Updated Date - 2021-09-26T16:39:35+05:30 IST