Sarkaru vaari paata: మ్యూజికల్ ఫీస్ట్ అప్పుడు మొదలవబోతుందా..!
ABN , First Publish Date - 2022-01-14T15:46:55+05:30 IST
'సర్కారు వారి పాట' మ్యూజికల్ ఫీస్ట్ ఈ నెలలోనే మొదలవబోతుందని తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తాజా
'సర్కారు వారి పాట' మ్యూజికల్ ఫీస్ట్ ఈ నెలలోనే మొదలవబోతుందని తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ప్రస్తుతం వైజాగ్లో జరుగుతుందని తెలుస్తోంది. కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ సంగీత అందిస్తున్నాడు. అయితే, సంక్రాంతి కానుకగా 'సర్కారు వారి పాట' నుంచి మ్యూజిక్ ఫెస్ట్ మొదలై ఫస్ట్ సింగిల్ను వదులుతారని అందరూ భావించారు.
కానీ, ప్రస్తుతం నెలకొన్న పరిస్థుతుల కారణంగా సంక్రాంతికి కాకుండా జనవరి 26నుంచి ఈ మ్యూజిక్ ఫెస్ట్ మొదలవబోతుందని తాజా సమాచారం. త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా రానుందట. మహేశ్ అభిమానులే కాదు.. కామన్ ఆడియన్స్ కూడా సర్కారు వారి సందడి కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. పరిస్థితులన్నీ అనుకూలిస్తే ఏప్రిల్ 1న భారీ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కానుంది.