Natyam: జాతీయ అవార్డ్ అందుకున్న యువ నటి!
ABN , First Publish Date - 2022-10-01T01:29:32+05:30 IST
భారతీయ సంప్రదాయ నృత్యం ఆధారంగా రూపొందిన ‘నాట్యం’ చిత్రానికి జాతీయ అవార్డు వరించింది. కూచిపూడి డాన్సర్ సంధ్యా రాజు ఈ చిత్రంతో కథానాయికగా పరిచయమైన సంగతి తెలిసిందే!
భారతీయ సంప్రదాయ నృత్యం ఆధారంగా రూపొందిన ‘నాట్యం’ (Natyam)చిత్రానికి జాతీయ అవార్డు (national award)వరించింది. కూచిపూడి డాన్సర్ సంధ్యా రాజు (Sandhya raju)ఈ చిత్రంతో కథానాయికగా పరిచయమైన సంగతి తెలిసిందే! ఈ చిత్రం అందరి మన్ననలను అందుకోవడమే కాకుండా ప్రతిష్ఠాత్మకమైన జాతీయ సినీ పురస్కారాల్లో ఉత్తమ కొరియోగ్రఫీ (Best chorio) విభాగంలో స్థానం సంపాదించుకుంది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన 68వ జాతీయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సంధ్యా రాజు ‘నాట్యం’ చిత్రానికిగానూ బెస్ట్ కొరియోగ్రఫీ కేటగిరీలో అవార్డును అందుకున్నారు.
సంధ్యారాజు, కమల్ కామరాజు, రోహిత్ బెహల్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ఈ చిత్రానికి రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించారు. కథానాయిక సంధ్యా రాజునే ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడం విశేషం. గత ఏడాది అక్టోబర్ 22న ఈ చిత్రం విడుదలైంది.