మహేశ్ మరదలిగా.. రానా హీరోయిన్ ?

ABN , First Publish Date - 2022-01-26T21:19:27+05:30 IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలోని మూడో చిత్రం అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే.. సినిమా ఎప్పుడు మొదలవుతుందనే ఆత్రుతతో ఉన్నారు అభిమానులు. ప్రస్తుతం మహేశ్.. పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకి చేరుకుంది. నిజానికి ఈ సంక్రాంతికే త్రివిక్రమ్ సినిమా మొదలైపోవాలి. మహేశ్ కరోనా బారిన పడడం, రమేశ్ బాబు మరణించడంతో ఈ ప్రాజెక్ట్ మొదలవడానికి బాగా లేటయింది. ఏప్రిల్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి... వచ్చే సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

మహేశ్ మరదలిగా.. రానా హీరోయిన్ ?

సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలోని మూడో చిత్రం అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే..  సినిమా ఎప్పుడు మొదలవుతుందనే ఆత్రుతతో ఉన్నారు అభిమానులు. ప్రస్తుతం మహేశ్..  పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకి చేరుకుంది. నిజానికి ఈ సంక్రాంతికే త్రివిక్రమ్ సినిమా మొదలైపోవాలి. మహేశ్ కరోనా బారిన పడడం, రమేశ్ బాబు మరణించడంతో ఈ ప్రాజెక్ట్ మొదలవడానికి బాగా లేటయింది. ఏప్రిల్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి... వచ్చే సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 


ఇటీవల దుబాయ్ లో ఈ సినిమాకి సంబంధించిన కథా చర్చలు జరిగాయి. అక్కడే త్రివిక్రమ్ మహేశ్ కు ఫైనల్ నెరేషన్ ఇచ్చారని, స్టోరీ కూడా లాక్ చేశారని సమాచారం. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా..ఆమె చెల్లెలు పాత్రకు మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ ను ఎంపిక చేసినట్టు సమాచారం. పవర్ స్టార్ ‘భీమ్లా నాయక్’ లో సంయుక్త రానా భార్యగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె టాలెంట్ కు ఫిదా అయిన త్రివిక్రమ్.. మహేశ్ మూవీలో ఆమెకి కీలక పాత్ర కోసం ఆమెను సంప్రదించారట. సంయుక్త ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమాలో సంయుక్త మీనన్ పాత్ర ఎలా ఉండబోతోందో చూడాలి. 

Updated Date - 2022-01-26T21:19:27+05:30 IST