‘విక్రమార్కుడు 2’ దర్శకుడిగా సంపత్ నంది?

ABN , First Publish Date - 2021-09-21T20:49:34+05:30 IST

దర్శక ధీరుడు రాజమౌళి బిగినింగ్ లో తెరెక్కించిన చిత్రాల్లో చాలా ప్రత్యేకమైనది ‘విక్రమార్కుడు’. మాస్ మహారాజా రవితేజ ఇందులో ద్విపాత్రాభినయం చేయడంతో పాటు.. అతడి కెరీర్ లోనే ఓ ల్యాండ్ మార్క్ మూవీ అయింది.

‘విక్రమార్కుడు 2’ దర్శకుడిగా సంపత్ నంది?

దర్శక ధీరుడు రాజమౌళి బిగినింగ్ లో తెరెక్కించిన చిత్రాల్లో చాలా ప్రత్యేకమైనది ‘విక్రమార్కుడు’. మాస్ మహారాజా  రవితేజ ఇందులో ద్విపాత్రాభినయం చేయడంతో పాటు.. అతడి కెరీర్ లోనే ఓ ల్యాండ్ మార్క్ మూవీ అయింది. చాన్నాళ్ళ తర్వాత ఈ సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ ..  దీనికి  సీక్వెల్ కథ రాస్తున్నట్టు చెప్పి.. అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఆ సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహించే ఛాన్సే లేదు కాబట్టి.. ఇలాంటి మూవీని ఎవరు డైరెక్ట్ చేస్తారనే అంశం టాలీవుడ్ లో ఆసక్తిగా మారింది. అయితే  ‘విక్రమార్కుడు 2’ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించే అవకాశాలున్నాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. 


సంపత్ నంది ఇటీవల గోపీచంద్ తో ‘సీటీమార్’ తెరకెక్కించి మంచి విజయం సాధించారు. అందుకే ‘విక్రమార్కుడు’ సీక్వెల్ ను సంపత్ నంది చేతిలో పెట్టాలని ఓ ప్రముఖ నిర్మాత ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇక ఇందులో హీరో గా ఎవరు నటిస్తారు అనే విషయానికొస్తే.. మొదటి భాగంలో ద్విపాత్రాభినయం చేసి సినిమాకే హైలైట్ గా నిలిచిన రవితేజ నే నటిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆయన నటిస్తేనే న్యాయం జరగుతుందని మేకర్స్ భావిస్తున్నారట. రవితేజ గతంలో సంపత్ నందితో ‘బెంగాల్ టైగర్’ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పర్వాలేదనిపించుకుంది. దాంతో సంపత్ నంది దర్వకత్వంలో రవితేజ ‘విక్రమార్కుడు 2’ ను పట్టాలెక్కించే ఆలోచన చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా గురించి అనౌన్స్ మెంట్ రావచ్చని టాక్. మరి మరో విక్రమార్కుడుగా రవితేజ ఇంకే రేంజ్ లో అదరగొడతారో చూడాలి. 

Updated Date - 2021-09-21T20:49:34+05:30 IST