శ్రీదేవి మూవీస్తో సమంత..?
ABN , First Publish Date - 2021-09-18T19:07:50+05:30 IST
ఇటీవలే 'శాకుంతలం' చిత్ర షూటింగ్ పూర్తి చేసిన సమంత త్వరలో శ్రీదేవి మూవీస్ నిర్మాణ సంస్థలో ఓ మూవీ చేయబోతుందని తెలుస్తోంది. ఆమె ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతి, నయనతరాలతో కలిసి ఓ మల్స్టీస్టారర్ మూవీలో నటిస్తోంది.
ఇటీవలే 'శాకుంతలం' చిత్ర షూటింగ్ పూర్తి చేసిన సమంత త్వరలో శ్రీదేవి మూవీస్ నిర్మాణ సంస్థలో ఓ మూవీ చేయబోతుందని తెలుస్తోంది. ఆమె ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతి, నయనతరాలతో కలిసి ఓ మల్స్టీస్టారర్ మూవీలో నటిస్తోంది. చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇదే క్రమంలో ఆమె మరో కొత్త ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తాజా సమాచారం. 'ఆదిత్య369', 'వంశానికొక్కడు', నానితో 'జెంటిల్మెంట్', సుదీర్ బాబుతో 'సమ్మోహనం' వంటి హిట్ చిత్రాలు తీసిన సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్గా సమంత నటించనుందట. దీని ద్వారా కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడని తెలుస్తోంది. నవంబర్ నుంచి సెట్స్ మీదకి తీసుకు వచ్చేందుకుందుకు సన్నాహాలు చేస్తుండగా, త్వరలోనే టైటిల్, నటీనటులు సహా ఇతర వివరాలు అధికారికంగా వెల్లడించనున్నారు.