ఈశా వేడుకల్లో సమంతను ఆటపట్టించిన సద్గురు

ABN , First Publish Date - 2021-03-12T20:51:05+05:30 IST

ఈశా ఫౌండేషన్ నిర్వహించిన శివరాత్రి మహోత్సవాల్లో సమంత అక్కినేని సందడి చేశారు.

ఈశా వేడుకల్లో సమంతను ఆటపట్టించిన సద్గురు

ఇంటర్నెట్ డెస్క్: ఈశా ఫౌండేషన్ నిర్వహించిన శివరాత్రి మహోత్సవాల్లో సమంత అక్కినేని సందడి చేశారు. తెలుగు గాయని మంగ్లీ పాడిన పాటలకు ఆమె కూడా పాదం కలిపారు. ఈ సందర్భంగా సరదా సన్నివేశం చోటు చేసుకుంది. వేడుకల్లో సంగీతోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. శివరాత్రి జాగరణలో పాల్గొనేవారికి భక్తి గీతాలను వినిపిస్తుంటారు. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల నుంచి మంగ్లీ పాల్గొన్నారు. ఆమె పాట పాడుతుంటే సాక్షాత్తు సద్గురు జగ్గీ వాసుదేవ్ డ్యాన్స్ చేశారు. తను డ్యాన్స్ చేయడమేగాక అందరినీ ఉత్సాహపరిచారు. అదే సమయంలో స్టేజ్ దిగి సమంత ఉన్న చోటికి వెళ్లిన ఆయన.. ఆమెను డ్యాన్స్ చేయమని కోరారు. దీంతో ఆమె నవ్వుతూ అలాగే ఉండిపోయారు. అయితే సమంత చేతిని చిన్నగా గిచ్చి.. ఆటపట్టించారు. గురువు ఆదేశాలతో అక్కడి వారితో కలిసి సమంత డ్యాన్స్ చేశారు. ఈ సన్నివేశం నెట్టింట హల్ చల్ చేస్తోంది.


సద్గురుకు పెద్ద ఎత్తున ఫాలోవర్లు ఉన్న విషయం తెలిసిందే. సమంత కూడా ఆయన శిష్యులలో ఒకరు. గత జనవరిలో కోయంబత్తూరులోని ఈశా సెంటర్‌కు సమంత వెళ్లొచ్చారు. గురువు కనపడితే.. శిష్యుడు సిద్ధంగా ఉంటారని ఆమె పేర్కొన్నారు.  

Updated Date - 2021-03-12T20:51:05+05:30 IST