‘ ఊ ’ అనేందుకు కోట్లల్లో పారితోషికం తీసుకున్న సమంత..?
ABN , First Publish Date - 2022-01-16T20:42:16+05:30 IST
అల్లు అర్జున్ కీలక పాత్రలో నటించిన సినిమా ‘‘ పుష్ప: ది రైజ్ ’’. లెక్కల మాస్టారు సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు
అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా ‘‘పుష్ప: ది రైజ్’’. లెక్కల మాస్టారు సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘‘మైత్రీ మూవీ మేకర్స్’’ పుష్ప సినిమాని నిర్మించింది. పాన్ ఇండియాగా ఆ మూవీ తెరకెక్కింది. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాలో సమంత ‘‘ ఊ అంటావా మావ.. ఊ ఊ అంటావా..’’ అనే స్పెషల్ సాంగ్ చేసింది. ఆ పాట యూట్యూబ్లో అత్యధిక వ్యూస్తో దూసుకుపోయింది. గ్లోబల్ నంబర్ వన్ సాంగ్గా రికార్డు సృష్టించింది. ఆ పాట చేసేందుకు సమంత కోట్లల్లోనే పారితోషికం తీసుకుందని తెలుస్తోంది.
‘‘ ఆ పాట చేసేందుకు ఆమె భారీ మొత్తం తీసుకుంది. చిత్ర బృందం ఆమెను సంప్రదించినప్పుడు ఆ పాట చేసేందుకు ఒప్పుకోలేదు. అల్లు అర్జున్ చెప్పడం వల్లే సమంత ‘ ఊ ’ అంది. 3నిమిషాల పాట చేసేందుకు దాదాపుగా రూ. 5కోట్లు తీసుకుంది. స్పెషల్ సాంగ్ చేసేందుకు మొదట్లో కొన్ని షరతులు విధించింది. కానీ, షూటింగ్ సమయంలో ఒక్క స్టెప్ను కూడా మార్చమని అడగలేదు ’’ అని చిత్ర బృందంతో సంబంధం ఉన్న వ్యక్తి చెప్పారు.