Samantha: మొదటిరోజు 21... త్వరలో వందకి చేరతా!

ABN , First Publish Date - 2021-09-28T01:38:49+05:30 IST

సమంత ఒక్కో సందర్భంలో ఒక్కో పనిపై దృష్టి సారిస్తుంటారు. ఖాళీ దొరికితే తన పెంపుడు కుక్క పిల్లలతో ఆడుతుంటారు. మొక్కలు పెంచుతారు. సరదాగా స్నేహితులతో గడుపుతుంటారు. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంటారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో వర్షం పడుతుండగా.. పారా సైక్లిస్ట్స్‌తో కలిసి సైకిల్‌ రైడ్‌కి వెళ్లారు.

Samantha: మొదటిరోజు 21... త్వరలో వందకి చేరతా!

సమంత ఒక్కో సందర్భంలో ఒక్కో పనిపై దృష్టి సారిస్తుంటారు. ఖాళీ దొరికితే తన పెంపుడు కుక్క పిల్లలతో ఆడుతుంటారు. మొక్కలు పెంచుతారు. సరదాగా స్నేహితులతో గడుపుతుంటారు. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంటారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో వర్షం పడుతుండగా.. పారా సైక్లిస్ట్స్‌తో కలిసి సైకిల్‌ రైడ్‌కి వెళ్లారు. వారితో కలిసి సైకిల్‌ తొక్కుత్కున్న వీడియో తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలో షేర్‌ చేశారు. ‘‘ప్రతీ రోజూ ఈ పారా సైక్లిస్ట్స్‌, సైకిలింగ్‌ నాకు స్ఫూర్తి. వర్షంలో ఈ టీమ్‌తో కలిసి సైకిల్‌  తొక్కడం మంచి అనుభూతి కలిగించింది. మొదటిరోజు 21 కిలోమీటర్ల గమ్యాన్ని చేరుకున్నా. త్వరలోనే వంద కిలో మీటర్లను చేరుకునేందుకు సిద్థంగా ఉన్నా’’ అని సామ్‌ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ఇటీవల చెన్నైలో షూటింగ్‌ గ్యాప్‌లో కీర్తిసురేష్‌, త్రిష, కల్యాణి ప్రియదర్శన్‌తో కలిసి సరదాగా గడిపారు. 


Updated Date - 2021-09-28T01:38:49+05:30 IST