Pic of the Day : ఒకే ఫ్రేమ్‌లో చెర్రీ, సల్లూభాయ్, వెంకీ

ABN , First Publish Date - 2022-06-27T15:09:22+05:30 IST

కొన్ని ఫోటోలకు మాటలు చాలవు, కేప్షన్ కూడా సరిపోదు. ఇలాంటి ఫోటోస్ చాలా అరుదుగా.. క్లిక్ మంటూంటాయి. అలాంటి ఓ అదిరిపోయే సందర్భం వచ్చింది కాబట్టి.. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘పిక్ ఆఫ్ ది డే’ గా తెగ వైరల్ అవుతోంది.

Pic of the Day : ఒకే ఫ్రేమ్‌లో చెర్రీ, సల్లూభాయ్, వెంకీ

కొన్ని ఫోటోలకు మాటలు చాలవు, కేప్షన్ కూడా సరిపోదు. ఇలాంటి ఫోటోస్ చాలా అరుదుగా.. క్లిక్ మంటూంటాయి. అలాంటి ఓ అదిరిపోయే సందర్భం వచ్చింది కాబట్టి.. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘పిక్ ఆఫ్ ది డే’ గా తెగ వైరల్ అవుతోంది. ఒకే ఫ్రేమ్‌లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan), విక్టరీ వెంకటేష్ (Venkatesh), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan), పూజా హెగ్డే (Pooja Hegde), ఉపాసనా రామ్ చరణ్ (Upasana Ramcharan) కనిపించి అభిమానులకు కనువిందు చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘కభీ ఈద్ కభీ దీవాలి’ (Kabhee Eed Kabhi Deewali) చిత్రంలో విక్టరీ వెంకటేశ్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. రామ్‌చరణ్ సైతం ఇందులో అతిథి పాత్రలో కనిపిస్తాడని వార్తలొస్తున్న నేపథ్యంలో ఈ ఫోటో మరింతగా విశేషాన్ని సంతరించుకుంది. 


అయితే ఈ సినిమాలో చరణ్ నటిస్తున్నాడా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే.. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. షూటింగ్ బ్రేక్‌లో రామ్ చరణ్, ఉపాసన దంపతులు సెట్లో సందడి చేశారు. ముంబై వెళ్ళినప్పుడు రామ్ చరణ్ తప్పకుండా సల్మాన్ ఖాన్ ను కలుస్తాడని, చరణ్ అక్కడ ఉన్నన్ని రోజులు సల్లూభాయ్ అతడికి కావల్సిన ఏర్పాట్లు చేస్తాడని ప్రచారం ఉంది. అందుకే సల్మాన్ ఖాన్ హైదరాబాద్ లో ఉన్నన్ని రోజులు రామ్ చరణ్ దగ్గురుండి అన్ని విషయాల్ని చూసుకుంటున్నాడట. 


ఈ సందర్భంలోనే సల్మాన్ ఖాన్, వెంకటేశ్, రామ్ చరణ్, ఉపాసన, పూజా హెగ్డే కలిసి ఈ ఫోటోను దిగారని తెలుస్తోంది. ఒకే ఫ్రేమ్ లో ఇంతమంది స్టార్స్ ఉండడంతో అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.  సల్మాన్ ఖాన్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘గాడ్‌ఫాదర్’ (Godfather) లో ప్రత్యేక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ ‘కభీ ఈద్ కభీ దీవాలి’ చిత్రంలో మన స్టార్స్ వెంకీ, చెర్రీ నటిస్తుండడం విశేషం.   

Updated Date - 2022-06-27T15:09:22+05:30 IST