సల్మాన్, కత్రినాలకి టర్కీ మంత్రి ఆతిథ్యం

ABN , First Publish Date - 2021-09-05T14:12:58+05:30 IST

బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, కత్రినాలకి టర్కీ మంత్రి ఆతిథ్యం ఇచ్చారు. వీరిద్దరు జంటగా తెరకెక్కుతున్న హిందీ చిత్రం 'టైగర్-3'. బ్లాక్ బస్టర్ 'టైగర్ జిందా హై'కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం టర్కీలో శరవేగంగా సాగుతోంది.

సల్మాన్, కత్రినాలకి టర్కీ మంత్రి ఆతిథ్యం

బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, కత్రినాలకి టర్కీ మంత్రి ఆతిథ్యం ఇచ్చారు. వీరిద్దరు జంటగా తెరకెక్కుతున్న హిందీ చిత్రం 'టైగర్-3'. బ్లాక్ బస్టర్ 'టైగర్ జిందా హై'కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం టర్కీలో శరవేగంగా సాగుతోంది. ఇందులో భాగంగా సల్మాన్, కత్రినా టర్కీలో ఉన్నారు. వీరికి టర్కీ సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న టర్కిష్ వ్యాపారవేత్త, రాజకీయవేత్త మెహ్మెత్ నూరి ఎర్సోయ్ ఆతిథ్యం ఇచ్చారు. తాజాగా ఆయన.. సల్మాన్, కత్రినాలను కలిసిన విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నారు. ఈ మేరకు సల్మాన్, కత్రినాలతో దిగిన ఫొటోలను షేర్ చేశారు. ఈ సందర్భంగా "అంతర్జాతీయ తారలు… సినిమా ప్రాజెక్టులకు దేశం మద్దతు ఇస్తుంది. మంచి ఆతిథ్యం ఇస్తుంది".. అని మెహ్మెత్ నూరి ఎర్సోయ్ టర్కిష్‌లో రాశారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Updated Date - 2021-09-05T14:12:58+05:30 IST