ఆస్పత్రిలో సైరాబాను
ABN , First Publish Date - 2021-09-02T05:39:51+05:30 IST
దివంగత నటుడు దిలీప్కుమార్ సతీమణీ, అలనాటి హీరోయిన్ సైరాబాను (77) ఆస్పత్రిలో చేరారు. లో బ్లడ్ ప్రెషర్ కారణంగా ఇబ్బందులు తలెత్తడంతో ఆమెను...
దివంగత నటుడు దిలీప్కుమార్ సతీమణీ, అలనాటి హీరోయిన్ సైరాబాను (77) ఆస్పత్రిలో చేరారు. లో బ్లడ్ ప్రెషర్ కారణంగా ఇబ్బందులు తలెత్తడంతో ఆమెను మూడు రోజుల క్రితం ముంబైలోని హిందూజా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగ్గా ఉందనీ, కోలుకుంటున్నారనీ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆస్పత్రిలో కొవిడ్ వార్డ్ లేదనీ, అయితే ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించామనీ, నెగెటివ్ అని తేలిందనీ ఆ వర్గాలు చెప్పాయి. ఐసీయూలో సైరాను ఉంచి, చికిత్స కొనసాగిస్తున్నామని చెప్పారు. భర్త దిలీప్కుమార్ జూలై ఏడున కన్ను మూయడంతో కుంగిపోయిన సైరా అనారోగ్యం పాలయి ఉండవచ్చని అంటున్నారు.