సైరాబానుకు అస్వస్థత
ABN , First Publish Date - 2021-09-01T23:46:10+05:30 IST
దివంగత నటుడు దిలీప్ కుమార్ సతీమణి సైరా బాను ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చేరారు. గత మూడు రోజులుగా రక్తపోటు సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమెను పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేర్చినట్లు సన్నిహితులు తెలిపారు.
దివంగత నటుడు దిలీప్ కుమార్ సతీమణి సైరా బాను ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చేరారు. గత మూడు రోజులుగా రక్తపోటు సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమెను పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేర్చినట్లు సన్నిహితులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. భర్త దిలీప్ కుమార్ మరణంతో కుంగిపోయిన ఆమె అనారోగ్యం బారిన పడ్డారని సన్నిహితులు చెబుతున్నారు.