తిరోగమనం కన్నా పునరాగమనం ఎప్పుడూ బలమైనది : సాయిధరమ్ తేజ్

ABN , First Publish Date - 2022-01-16T20:07:30+05:30 IST

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ గతేడాది సెప్టెంబర్ లో బైక్ యాక్సిడెంట్ కు గురై.. కొంతకాలం ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. అతడు తిరిగి కోలుకోడానికి దాదాపు నాలుగు నెలల టైమ్ పట్టింది. అప్పటి నుంచి సాయిధరమ్ మీడియా ముందు రాలేదు. భోగి పండుగ సందర్భంగా మేనమామ చిరంజీవి ఇంట్లో వరుణ్ తేజ, తమ్ముడు వైష్ణవ్ తేజ తో కలిసి సోషల్ మీడియాలో ఫోకస్ అయ్యాడు సాయిధరమ్ . చిరు, వరుణ్ తేజ్ పోటీ పడి సరదాగా దోశెలు, జోకులు వేసుకోవడం మెగాస్టార్ విడుదల చేసిన వీడియో లో కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తిరోగమనం కన్నా పునరాగమనం ఎప్పుడూ బలమైనది : సాయిధరమ్ తేజ్

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ గతేడాది సెప్టెంబర్ లో బైక్ యాక్సిడెంట్ కు గురై.. కొంతకాలం ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. అతడు తిరిగి కోలుకోడానికి దాదాపు నాలుగు నెలల టైమ్ పట్టింది. అప్పటి నుంచి సాయిధరమ్ మీడియా ముందుకు రాలేదు. సంక్రాంతి సందర్భంగా మేనమామ చిరంజీవి ఇంట్లో రామ్ చరణ్, వరుణ్ తేజ, తమ్ముడు వైష్ణవ్ తేజ తో కలిసి సోషల్ మీడియాలో ఫోకస్ అయ్యాడు సాయిధరమ్. చిరు, వరుణ్ తేజ్ పోటీ పడి సరదాగా దోశెలు, జోకులు వేసుకోవడం మెగాస్టార్ విడుదల చేసిన వీడియో లో కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


ఇక ఈ రోజు (ఆదివారం) సాయిధరమ్ తేజ్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా అభిమానుల ముందుకు వచ్చాడు. ‘తిరోగమనం కన్నా పునరాగమనం ఎప్పుడూ బలమైనది’ అంటూ ట్వీట్ చేశాడు సాయిధరమ్. తాను వెనకబడడం  నుంచి  తిరిగి మళ్ళీ తెరమీద కనిపించబోతుండడం ఎక్కువ ఆనందాన్నిస్తోందన్నట్టుగా చెప్పడం అభిమానుల్ని ఖుషీ చేస్తోంది. తేజు ఈ నెల్లోనే తన కొత్త చిత్రం షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. సుకుమార్ శిష్యుడు  కార్తిక్ దండు దర్శకత్వంలో మిస్టిక్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. 



Updated Date - 2022-01-16T20:07:30+05:30 IST