మహేశ్ ట్వీట్. సాయిపల్లవి సమాధానం
ABN , First Publish Date - 2021-09-28T01:57:34+05:30 IST
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్స్టోరి’ చిత్రం సూపర్హిట్ టాక్ అందుకుంది. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్లో కూడా బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఎక్కడ చూసిన సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవి నటన గురించే టాక్ నడుస్తోంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు.
మహేశ్ సర్.. మీ ట్వీట్ మిలియన్ టైమ్స్ చదివా!
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్స్టోరి’ చిత్రం సూపర్హిట్ టాక్ అందుకుంది. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్లో కూడా బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఎక్కడ చూసిన సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవి నటన గురించే టాక్ నడుస్తోంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల మహేశ్బాబు సాయిపల్లవిపై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే!
‘‘సాయి పల్లవి తెరపై సెన్సేషన్ క్రియేట్ చేసింది. అసలు ఆమెకు బోన్స్ ఉన్నాయా? స్ర్కీన్పై ఎవరూ ఆ తరహాలో డ్యాన్స్ చేయడం చూడలేదు’ అని మహేశ్ రాసుకొచ్చారు. ఆ ట్వీట్కు సాయిపల్లవి సమాధానంఇచ్చారు. మీ మాటలు నాకు మరింత ఎనర్జీని ఇస్తున్నాయి. నాలో ఉన్న మీ ఫ్యాన్ మీ ట్వీట్ను ఇప్పటికీ మిలియన్ టైమ్స్ చదివేసింది. మీ ప్రశంసలకు కృతజ్ఞురాలిని. మహేశ్ సర్’ అంటూ ఆమె ఆనందం వ్యక్తం చేశారు.